దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బాధితులను ఐసోలేషన్ వార్డులకు తరలించామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరికీ యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు ఆరు ల్యాబ్ల్లో 24 గంటలు... మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారని మంత్రి వివరించారు. షాద్నగర్కు చెందిన ఒకరు, సికింద్రాబాద్కు చెందిన మరొకరు మృతి చెందినట్లు ఈటల అన్నారు. మృతులతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి : కరోనా పరీక్షలకు ఇక కొత్త పద్ధతి- అరగంటలో రిజల్ట్