అసంఘటిత కార్మికుల వివరాల నమోదు వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అసంఘటిత కార్మికుల నమోదుపై దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన పిల్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రత్యేక సీఎస్ రాణి కుముదినీ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల నమోదు ఎందుకు ప్రారంభించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్రం సాఫ్ట్వేర్ సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాఫ్ట్వేర్లో పొందుపరిచేందుకు డేటా సిద్ధంగా ఉందా అని హైకోర్టు అడిగింది. ఈ మేరకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రత్యేక సీఎస్ తదుపరి విచారణకూ హాజరు కావాలని ఆదేశించింది.