రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కోసం 6900 కోట్ల రూపాయలు డబ్బు విడుదల చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎకరాకు నాలుగు వేల సాయాన్నందించే ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచుతూ... రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా 6900 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల కోడ్ ఈ నెల ఎనిమిదో తేదీతో ముగియనుంది. ఆ తరువాత రైతుబంధు సాయాన్ని రైతులకు అందించనున్నారు.
ఇవీ చూడండి: ఆ 343 మంది అభ్యర్థుల పత్రాలు పున: సమీక్షించండి