ETV Bharat / state

రైతుబంధు పథకానికి నిధులు విడుదల

author img

By

Published : Jun 3, 2019, 3:54 PM IST

Updated : Dec 29, 2022, 10:44 AM IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేశారు. 8న ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ సాయాన్ని కర్షకులకు అందించనున్నారు.

Raithu Bandhu
రైతుబంధు పథకానికి నిధులు విడుదల

రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్​కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కోసం 6900 కోట్ల రూపాయలు డబ్బు విడుదల చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎకరాకు నాలుగు వేల సాయాన్నందించే ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచుతూ... రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా 6900 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల కోడ్ ఈ నెల ఎనిమిదో తేదీతో ముగియనుంది. ఆ తరువాత రైతుబంధు సాయాన్ని రైతులకు అందించనున్నారు.

రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్​కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కోసం 6900 కోట్ల రూపాయలు డబ్బు విడుదల చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎకరాకు నాలుగు వేల సాయాన్నందించే ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచుతూ... రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా 6900 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల కోడ్ ఈ నెల ఎనిమిదో తేదీతో ముగియనుంది. ఆ తరువాత రైతుబంధు సాయాన్ని రైతులకు అందించనున్నారు.

ఇవీ చూడండి: ఆ 343 మంది అభ్యర్థుల పత్రాలు పున: సమీక్షించండి

Last Updated : Dec 29, 2022, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.