ETV Bharat / state

'వరదల వల్ల జరిగిన​ నష్టాన్ని ప్రభుత్వం పూరించలేదు' - ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీపీఐ నేతలు తాజా వార్త

గత కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని వామపక్ష పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్​లో వరద వల్ల ఏర్పడిన నష్టాన్ని ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా పూరించలేవని విమర్శించారు. ఓరుగల్లులో అక్రమకట్టడాల విషయమై చర్యలు తీసుకుని మంత్రి కేటీఆర్​ మాట నిలబెట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

CPI Narayana and Chada Venkat Reddy criticized the government
'వరదల వల్ల జరిగిన​ నష్టాన్ని ప్రభుత్వం పూరించలేదు'
author img

By

Published : Aug 21, 2020, 6:28 PM IST

భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. వరంగల్​లో 50 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని... కబ్జాచేసిన వారంతా ప్రస్తుతం తెరాస నాయకులేనని ఆరోపించారు. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయన్నారు. కరీంనగర్ జిల్లాలో రేకొండ-బొమ్మనపల్లి కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే అరెస్టు చేసి... ఆయన ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కూలిన కల్వర్టును చూస్తే సిమెంట్ తక్కువ చేసి ఎక్కవ ఇసుకతో నిర్మించినట్టు తెలుస్తోందన్నారు. నాసిరకం కట్టడాల వల్ల చెరువుల కట్టలు తెగిపోతున్నాయన్నారు.

వరంగల్ జిల్లాలో మొత్తం అక్రమ నిర్మాలన్న మంత్రులు, ఎవరు చేశారో కూడా బయట పెట్టాలని చాడ డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకుని కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు అందించాల్సిన తక్షణ సహకరంపై కేసీఆర్, కేటీఆర్​కు లేఖ రాస్తామని చాడ తెలిపారు.

భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. వరంగల్​లో 50 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని... కబ్జాచేసిన వారంతా ప్రస్తుతం తెరాస నాయకులేనని ఆరోపించారు. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయన్నారు. కరీంనగర్ జిల్లాలో రేకొండ-బొమ్మనపల్లి కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే అరెస్టు చేసి... ఆయన ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కూలిన కల్వర్టును చూస్తే సిమెంట్ తక్కువ చేసి ఎక్కవ ఇసుకతో నిర్మించినట్టు తెలుస్తోందన్నారు. నాసిరకం కట్టడాల వల్ల చెరువుల కట్టలు తెగిపోతున్నాయన్నారు.

వరంగల్ జిల్లాలో మొత్తం అక్రమ నిర్మాలన్న మంత్రులు, ఎవరు చేశారో కూడా బయట పెట్టాలని చాడ డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకుని కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు అందించాల్సిన తక్షణ సహకరంపై కేసీఆర్, కేటీఆర్​కు లేఖ రాస్తామని చాడ తెలిపారు.

ఇదీ చూడండి: గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.