ETV Bharat / state

మాజీ మంత్రి జువ్వాడి మృతికి బండి సంజయ్​ సంతాపం

author img

By

Published : May 10, 2020, 6:17 PM IST

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్​ రావు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. కరీంనగర్​ రాజకీయాల్లో రత్నాకర్​రావు చెరగని ముద్ర వేశారన్నారు.

బండి సంజయ్​
బండి సంజయ్​

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్​ రావు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. కరీంనగర్‌ రాజకీయాల్లో రత్నాకర్ రావు చెరగని ముద్ర వేశారన్నారు.

రాజకీయాల్లో జువ్వాడి నిబద్ధత కలిగిన నాయకుడని... ఆయన నీతికి, నిజాయతీకి మారుపేరుగా నిలిచారని సంజయ్​ తెలిపారు. అనేక మంది కార్యకర్తలకు మార్గదర్శకులుగా నిలిచి... ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. కొద్ది నెలల క్రితమే ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సందర్భం ఇంకా తన కళ్ల ముందే కదులుతుందని చెప్పారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్​ రావు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. కరీంనగర్‌ రాజకీయాల్లో రత్నాకర్ రావు చెరగని ముద్ర వేశారన్నారు.

రాజకీయాల్లో జువ్వాడి నిబద్ధత కలిగిన నాయకుడని... ఆయన నీతికి, నిజాయతీకి మారుపేరుగా నిలిచారని సంజయ్​ తెలిపారు. అనేక మంది కార్యకర్తలకు మార్గదర్శకులుగా నిలిచి... ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. కొద్ది నెలల క్రితమే ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సందర్భం ఇంకా తన కళ్ల ముందే కదులుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.