హైదరాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో బోనాల వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని బోనం సమర్పించారు. శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బోనాల చివరి రోజు కూడా వర్షం కురుస్తుండడం సంతోషకరమైన పరిణామమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: అమ్మవారికి బంగారుబోనం సమర్పించిన పీవీ సింధు