ETV Bharat / state

మూడంచెల భద్రత నడమ ఈవీఎంలకు కాపలా - 2019 elections

లోక్​సభ ఎన్నికల్లో కీలకం ఘట్టం పూర్తైన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్​ రూంలకు తరలించారు అధికారులు. మూడంచెల భద్రత నడుమ జిల్లాల వారిగా భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పాలనాధికారులు. స్ట్రాంగ్​ రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్​ అమలు చేస్తున్నారు.

స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
author img

By

Published : Apr 13, 2019, 5:46 AM IST

Updated : Apr 13, 2019, 6:57 AM IST

స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. ఇప్పుడా ఈవీఎంలన్ని స్ట్రాంగ్‌ రూంలకు చేరుకున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్​లలో భద్రపర్చారు. వీటి నిర్వహణలో రాజకీయ పార్టీల వారికి అనుమానాలుంటే రిటర్నింగ్ అధికారి అనుమతితో పరిశీలించుకునే విధంగా సౌలభ్యం కల్పించారు.

మూడంచెల భద్రత

ఈవీఎంల భద్రత కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మొదటి దశలో స్థానిక పోలీసులు, రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక పోలీసులు, మూడో దశలో కేంద్ర బలగాలకు చెందిన పోలీసులను నియమించారు. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు డిచ్‌పల్లి సీఎంసీ కేంద్రానికి చేరుకున్నాయి. ఈవీఎంలను భద్రపరచిన యంత్రాంగం వాటిని సీల్​ చేసింది. మే 23న లెక్కింపు ప్రక్రియ ఉన్నందున స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్ట్రాంగ్​ రూమ్​ల పరిశీలన

ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పర్యవేక్షించారు. ఫలితాలకు సమయం ఉన్నందున కంటికి రెప్పలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
మెదక్​ పార్లమెంట్​ తాలూకు స్ట్రాంగ్ రూమ్​లను జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి పరిశీలించి సీలు వేశారు. నర్సాపూర్​లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గజ్వేల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కరీంనగర్​ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను ఎస్​ఆర్​ఆర్​ కళాశాలలో మూడంచెల భద్రత మధ్య భద్రపరిచారు. కలెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​తో కలిసి పోలీస్​ కమిషనర్​ కమలాసన్ ​రెడ్డి ఈవీఎంలు భద్రపరిచిన రూములను పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను మంథని జేఎన్​టీయూలో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్​కు 100 మీటర్ల చుట్టూ నిషేధం విధించారు. పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా పరిసరాల్లోకి రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా

స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. ఇప్పుడా ఈవీఎంలన్ని స్ట్రాంగ్‌ రూంలకు చేరుకున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్​లలో భద్రపర్చారు. వీటి నిర్వహణలో రాజకీయ పార్టీల వారికి అనుమానాలుంటే రిటర్నింగ్ అధికారి అనుమతితో పరిశీలించుకునే విధంగా సౌలభ్యం కల్పించారు.

మూడంచెల భద్రత

ఈవీఎంల భద్రత కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మొదటి దశలో స్థానిక పోలీసులు, రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక పోలీసులు, మూడో దశలో కేంద్ర బలగాలకు చెందిన పోలీసులను నియమించారు. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు డిచ్‌పల్లి సీఎంసీ కేంద్రానికి చేరుకున్నాయి. ఈవీఎంలను భద్రపరచిన యంత్రాంగం వాటిని సీల్​ చేసింది. మే 23న లెక్కింపు ప్రక్రియ ఉన్నందున స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్ట్రాంగ్​ రూమ్​ల పరిశీలన

ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పర్యవేక్షించారు. ఫలితాలకు సమయం ఉన్నందున కంటికి రెప్పలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
మెదక్​ పార్లమెంట్​ తాలూకు స్ట్రాంగ్ రూమ్​లను జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి పరిశీలించి సీలు వేశారు. నర్సాపూర్​లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గజ్వేల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కరీంనగర్​ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను ఎస్​ఆర్​ఆర్​ కళాశాలలో మూడంచెల భద్రత మధ్య భద్రపరిచారు. కలెక్టర్​ సర్ఫరాజ్​ అహ్మద్​తో కలిసి పోలీస్​ కమిషనర్​ కమలాసన్ ​రెడ్డి ఈవీఎంలు భద్రపరిచిన రూములను పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను మంథని జేఎన్​టీయూలో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్​కు 100 మీటర్ల చుట్టూ నిషేధం విధించారు. పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా పరిసరాల్లోకి రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా

New Delhi, April 12: An expert has termed the US INTERPOL'S refusal to grant an international arrest warrant against Gurpatwant Singh Pannun, the legal advisor of secessionist group based in the West Sikhs For Justice, a childish affair which will not impact India in any way. According to him, there soon will be enough evidence against Pannun that the INTERPOL is seeking and the fringe element will be behind bars. And even if there is no arrest warrant, India will remain as unperturbed as ever. The experts also said that the Khalistani propaganda fuelled by Pakistan and the issue is a miniscule one which will impact absolutely nothing in India, not even the internal policies and that Sikh support that they are seeking is just a figment of their imagination. Indeed, it has been witnessed in the past that there has rarely been any instance of the Sikh community supporting their sinister propaganda. Still, Pakistan and its puppets are not ready to give up. However, like experts believe, India remains unaffected by their propaganda which could be termed nothing but imbecile.
Last Updated : Apr 13, 2019, 6:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.