భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి చెందిన ఓ బాలికను సమీప గ్రామానికి చెందిన ముత్తయ్య అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. అనంతరం సదరు యువకుడు ఆ బాలికను పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేశాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు ఏఎస్పీ శబరిష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు న్యాయం చేయాలని మహిళసంఘం సభ్యులు కోరారు.