ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఆదివాసీల ఆశీర్వాదం ఎవరికో? - 2019 elections

ఆదిలాబాద్ రాజకీయం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎస్టీలకు రిజర్వైన ఈ నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయమంతా అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీల చుట్టే తిరుగుతోంది. గిరిపుత్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ నెలకొంది.

ఆదిలాబాద్​లో ఆదీవాసీలు, గిరిజనుల మధ్య పోటీ
author img

By

Published : Apr 2, 2019, 6:56 PM IST

ఆదిలాబాద్​లో ఆదీవాసీలు, గిరిజనుల మధ్య పోటీ
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు అయింది. మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన రమేష్ రాఠోడ్ విజయం సాధించగా... 2014లో తెరాస అభ్యర్థి గోడం నగేష్ గెలిచారు. ప్రస్తుతం అధికారపార్టీ తరఫున మరోసారి నగేష్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి రమేష్ రాఠోడ్, భాజపా అభ్యర్థిగా సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు.

ఆదివాసీ ఉద్యమమే కేంద్రంగా...

ఈ పార్లమెంటు పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో... బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ ఎస్టీ రిజర్వు స్థానాలు. బోథ్, ఖానాపూర్ నుంచి తెరాస అభ్యర్థులు రోఠోడ్ బాపూరావు, రేఖానాయక్ విజయం సాధించగా... ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. తరువాత సక్కు కూడా తెరాసకు మద్దతిచ్చారు. గతంలో ఆదివాసీ ఓట్లు చీలిపోవడం వల్లనే లంబాడీ తెగకు చెందిన నాయకుడు గెలిచారని... ఈసారి అలా జరగకుండా తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అయిదేళ్లుగా ఎంపీగా పనిచేసిన గోడం నగేష్‌... ఆదివాసీ గూడేల్లో పర్యటించలేదనే విమర్శ ఉంది. జిల్లాలో పురుడు పోసుకున్న ఆదివాసీ ఉద్యమానికి మద్దతివ్వలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికల సమయంలో నేతల మధ్య ఏర్పడ్డ విభేదాలతో పార్టీలోనూ అభిప్రాయభేధాలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐక్యతప్రదర్శించినా...లోలోపల ఎవరి దారి వారిదే అన్నట్లుగా మారింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన సోయం బాబూరావు ఆదివాసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గోడం నగేష్‌, సోయం బాపురావు ఆదివాసీ ఓట్ల కోసం పోటీ పడుతుండగా... రమేష్‌ రాఠోడ్‌ లంబాడ ఓట్లు చీలకుండా పావులు కదుపుతున్నారు.

ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?

ఆదిలాబాద్​లో ఆదీవాసీలు, గిరిజనుల మధ్య పోటీ
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు అయింది. మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన రమేష్ రాఠోడ్ విజయం సాధించగా... 2014లో తెరాస అభ్యర్థి గోడం నగేష్ గెలిచారు. ప్రస్తుతం అధికారపార్టీ తరఫున మరోసారి నగేష్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి రమేష్ రాఠోడ్, భాజపా అభ్యర్థిగా సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు.

ఆదివాసీ ఉద్యమమే కేంద్రంగా...

ఈ పార్లమెంటు పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో... బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ ఎస్టీ రిజర్వు స్థానాలు. బోథ్, ఖానాపూర్ నుంచి తెరాస అభ్యర్థులు రోఠోడ్ బాపూరావు, రేఖానాయక్ విజయం సాధించగా... ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. తరువాత సక్కు కూడా తెరాసకు మద్దతిచ్చారు. గతంలో ఆదివాసీ ఓట్లు చీలిపోవడం వల్లనే లంబాడీ తెగకు చెందిన నాయకుడు గెలిచారని... ఈసారి అలా జరగకుండా తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అయిదేళ్లుగా ఎంపీగా పనిచేసిన గోడం నగేష్‌... ఆదివాసీ గూడేల్లో పర్యటించలేదనే విమర్శ ఉంది. జిల్లాలో పురుడు పోసుకున్న ఆదివాసీ ఉద్యమానికి మద్దతివ్వలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికల సమయంలో నేతల మధ్య ఏర్పడ్డ విభేదాలతో పార్టీలోనూ అభిప్రాయభేధాలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐక్యతప్రదర్శించినా...లోలోపల ఎవరి దారి వారిదే అన్నట్లుగా మారింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన సోయం బాబూరావు ఆదివాసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గోడం నగేష్‌, సోయం బాపురావు ఆదివాసీ ఓట్ల కోసం పోటీ పడుతుండగా... రమేష్‌ రాఠోడ్‌ లంబాడ ఓట్లు చీలకుండా పావులు కదుపుతున్నారు.

ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?

Intro:100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తా


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మనుగూరు.
రానున్న కాలంలో ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తామని మణుగూరు ఏరియా జిఎం నరసింహా రావు పేర్కొన్నారు ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ఆయన వెల్లడించారు. మార్చి నెలలో 113 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని 2018 19 ఇది ఆర్థిక సంవత్సరానికిగాను 91 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. మణుగూరు ఏరియాల పండుగలు ఉపరితల గని అత్యధిక శాతం ఉత్పత్తి చేసిందని తెలిపారు. ఉత్పత్తుల వెనకబడిన ఓబీ రవాణా ఓమాత్రం ముందు ఉన్నామని తెలిపారు.


Conclusion:పోసిటివ్ పని విధానంలో భాగంగా ఆరు కిలోమీటర్ల బలం ఉన్నామని ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి గత కంటే తగ్గుతుందని పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.