కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతోన్న మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ పర్వాలేదనిపించింది. డికాక్ (55), రోహిత్ (33) రాణించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది.
శుభారంభం దక్కినా..
ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్ (55) జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి బంతికే ఫోర్తో ఇన్నింగ్స్ను ఆరంభించిన హిట్మ్యాన్ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. మొదట నెమ్మదిగా ఆడిన డికాక్ తర్వాత రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి 56 పరుగులు చేసింది ముంబయి. అనంతరం 10వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు రోహిత్ (33). కాసేపటికే సూర్యకుమార్ (5) కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే సమయోచితంగా ఆడిన డికాక్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఐదు పరుగులు జోడించిన ఇతడు 55 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు.
అనంతరం ఇషాన్ కిషన్ (14) భారీ షాట్కు ప్రయత్నించి ఫెర్గుసన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివర్లో కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో పరుగులు రాబట్టడానికి కష్టపడ్డారు పొలార్డ్ (21), కృనాల్ (12) పాండ్యా. 6వ వికెట్కు 30 పరగులు జోడించిన వీరిద్దరూ ఫెర్గుసన్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో ఔటయ్యారు. చివరి బంతికి సౌరభ్ తివారి ఫోర్ బాదడం వల్ల ముంబయి ఇన్నింగ్స్ 155 పరుగుల వద్ద ముగిసింది.