ETV Bharat / sports

భారత బ్యాట్స్​మెన్​ 'హిట్​' షో... విండీస్ లక్ష్యం 388

author img

By

Published : Dec 18, 2019, 5:33 PM IST

Updated : Dec 19, 2019, 9:20 AM IST

విండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు, తొలి ఇన్నింగ్స్​లో అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు రోహిత్​, రాహుల్​ మొదట అదరగొట్టగా... ఆఖర్లో పంత్​, శ్రేయస్​ జోరు కొనసాగించారు. నిర్ణీత 50 ఓవర్లలో 388 పరుగుల భారీ లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచింది కోహ్లీ సేన.

india vs west indies ODI 2019
టీమిండియా బ్యాట్స్​మన్​ 'హిట్​' షో... విండీ లక్ష్యం 388

విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో పరుగుల వరద పారింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్​ శతకాలతో చెలరేగగా... ఆఖర్లో శ్రేయస్​, పంత్​​ సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది భారత్.

రోహిత్​-రాహుల్​ ఇన్నింగ్స్​...

సిరీస్​ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాలన్న కసి ఓ వైపు... భారీ స్కోరు సాధిస్తే తప్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభం కాదన్న విషయం మరోవైపు... ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న టీమిండియా ఓపెనర్లు.. తొలుత చాలా నెమ్మదిగా, నిలకడగా ఆడారు. వీలుచిక్కితే తప్ప అనవసరపు షాట్లకు పోకుండా శైలికి తగ్గట్లు ఆడాడు రోహిత్. ​ఈ మ్యాచ్​లో ఈ జోడీ​ శతకాలతో చెలరేగింది. రోహిత్​ కెరీర్​లో​ 28వ శతకం నమోదు చేసుకోగా, రాహుల్​.. వన్డే కెరీర్​లో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

  • రోహిత్​@28, రాహుల్​@3...

ఈ మ్యాచ్​ 107 బంతుల్లో శతకం సాధించిన రోహిత్​... 159 పరుగుల(138 బంతుల్లో; 17 ఫోర్లు, 5 సిక్సర్లు)​ వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కెరీర్​లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్​ రాహుల్.. ​ 102(104 బంతుల్లో; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. కెరీర్​లో మూడో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా స్వదేశంతో తొలి శతకం చేశాడు రాహుల్​. ఈ ఓపెనింగ్​ ద్వయం తొలి వికెట్​కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

ఈ ఏడాది టీమిండియా ఓపెనర్‌ రోహిత్​... 10 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో ఏడు శతకాలు సాధించాడు. ఈ ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 1998లో సచిన్‌ తెందూల్కర్​(9) సాధించిన రికార్డును అధిగమించాడు హిట్​మ్యాన్​.

2019లో ఐసీసీ టాప్‌-9 వన్డే ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లలో న్యూజిలాండ్‌ మినహా అన్ని జట్లపై రోహిత్‌ శతకాలు చేశాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో హిట్​మ్యాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. 1427 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు​. తర్వాత స్థానాల్లో కోహ్లీ(1292), విండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​(1225) ఉన్నారు.

కోహ్లీ గోల్డెన్​ డక్​...

వెస్టిండీస్​తో తొలి వన్డేలో నాలుగు పరుగులే చేసిన కోహ్లీ... రెండో మ్యాచ్​లోనూ విఫలమయ్యాడు. రాహుల్‌(102) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత వన్​ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్​... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌ 38వ ఓవర్‌ మూడో బంతిని షార్ట్​ బాల్‌ వేయగా... షాట్​ కొట్టబోయి మిడ్‌ వికెట్‌లో క్యాచ్ లేపాడు కోహ్లీ. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న రోస్టన్‌ ఛేజ్‌ పట్టుకున్నాడు. ఫలితంగా కోహ్లీ ఇన్నింగ్స్‌ ఖాతా తెరవకుండానే ముగిసింది.

ఈ మ్యాచ్​లో అరుదైన రికార్డు అందుకున్నాడు టీమిండియా సారథి. ఇది అతడికి 400వ అంతర్జాతీయ మ్యాచ్. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన ఎనిమిదో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు విరాట్​.

ఆఖర్లో చెలరేగిన శ్రేయస్​, పంత్​...

292 పరుగుల వద్ద రోహిత ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్​... సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓ ఎండ్​లో ఉన్న శ్రేయస్​ కూడా అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి చెరో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదేశారు. పంత్​ 39(16 బంతుల్లో), శ్రేయస్​ 53( 32 బంతుల్లో)రాణించాడు. వీరిద్దరూ 24 బంతుల్లో 73 రన్స్​ భాగస్వామ్యం నెలకొల్పారు.

కెరీర్​లో 6వ వన్డే అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్నాడు శ్రేయస్​ అయ్యర్​. ఆఖర్లో జాదవ్ 16, జడేజా 0 పరుగులు చేశారు.

ఇవీ చూడండి...

విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో పరుగుల వరద పారింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్​ శతకాలతో చెలరేగగా... ఆఖర్లో శ్రేయస్​, పంత్​​ సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది భారత్.

రోహిత్​-రాహుల్​ ఇన్నింగ్స్​...

సిరీస్​ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాలన్న కసి ఓ వైపు... భారీ స్కోరు సాధిస్తే తప్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభం కాదన్న విషయం మరోవైపు... ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న టీమిండియా ఓపెనర్లు.. తొలుత చాలా నెమ్మదిగా, నిలకడగా ఆడారు. వీలుచిక్కితే తప్ప అనవసరపు షాట్లకు పోకుండా శైలికి తగ్గట్లు ఆడాడు రోహిత్. ​ఈ మ్యాచ్​లో ఈ జోడీ​ శతకాలతో చెలరేగింది. రోహిత్​ కెరీర్​లో​ 28వ శతకం నమోదు చేసుకోగా, రాహుల్​.. వన్డే కెరీర్​లో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

  • రోహిత్​@28, రాహుల్​@3...

ఈ మ్యాచ్​ 107 బంతుల్లో శతకం సాధించిన రోహిత్​... 159 పరుగుల(138 బంతుల్లో; 17 ఫోర్లు, 5 సిక్సర్లు)​ వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కెరీర్​లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్​ రాహుల్.. ​ 102(104 బంతుల్లో; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. కెరీర్​లో మూడో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా స్వదేశంతో తొలి శతకం చేశాడు రాహుల్​. ఈ ఓపెనింగ్​ ద్వయం తొలి వికెట్​కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

ఈ ఏడాది టీమిండియా ఓపెనర్‌ రోహిత్​... 10 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో ఏడు శతకాలు సాధించాడు. ఈ ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 1998లో సచిన్‌ తెందూల్కర్​(9) సాధించిన రికార్డును అధిగమించాడు హిట్​మ్యాన్​.

2019లో ఐసీసీ టాప్‌-9 వన్డే ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లలో న్యూజిలాండ్‌ మినహా అన్ని జట్లపై రోహిత్‌ శతకాలు చేశాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో హిట్​మ్యాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. 1427 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు​. తర్వాత స్థానాల్లో కోహ్లీ(1292), విండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​(1225) ఉన్నారు.

కోహ్లీ గోల్డెన్​ డక్​...

వెస్టిండీస్​తో తొలి వన్డేలో నాలుగు పరుగులే చేసిన కోహ్లీ... రెండో మ్యాచ్​లోనూ విఫలమయ్యాడు. రాహుల్‌(102) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత వన్​ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్​... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌ 38వ ఓవర్‌ మూడో బంతిని షార్ట్​ బాల్‌ వేయగా... షాట్​ కొట్టబోయి మిడ్‌ వికెట్‌లో క్యాచ్ లేపాడు కోహ్లీ. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న రోస్టన్‌ ఛేజ్‌ పట్టుకున్నాడు. ఫలితంగా కోహ్లీ ఇన్నింగ్స్‌ ఖాతా తెరవకుండానే ముగిసింది.

ఈ మ్యాచ్​లో అరుదైన రికార్డు అందుకున్నాడు టీమిండియా సారథి. ఇది అతడికి 400వ అంతర్జాతీయ మ్యాచ్. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన ఎనిమిదో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు విరాట్​.

ఆఖర్లో చెలరేగిన శ్రేయస్​, పంత్​...

292 పరుగుల వద్ద రోహిత ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్​... సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓ ఎండ్​లో ఉన్న శ్రేయస్​ కూడా అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి చెరో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదేశారు. పంత్​ 39(16 బంతుల్లో), శ్రేయస్​ 53( 32 బంతుల్లో)రాణించాడు. వీరిద్దరూ 24 బంతుల్లో 73 రన్స్​ భాగస్వామ్యం నెలకొల్పారు.

కెరీర్​లో 6వ వన్డే అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్నాడు శ్రేయస్​ అయ్యర్​. ఆఖర్లో జాదవ్ 16, జడేజా 0 పరుగులు చేశారు.

ఇవీ చూడండి...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
UK POOL - AP CLIENTS ONLY
London - 18 December 2019
++AUDIO AS INCOMING++
1. Former British Prime Minister Tony Blair at lectern, preparing to speak
2. SOUNDBITE (English) Tony Blair, former British Prime Minister:
++TRANSCRIPT TO FOLLOW++
3. SOUNDBITE (English) Tony Blair, former British Prime Minister:
++TRANSCRIPT TO FOLLOW++
4. SOUNDBITE (English) Tony Blair, former British Prime Minister:
++TRANSCRIPT TO FOLLOW++
5. SOUNDBITE (English) Tony Blair, former British Prime Minister:
++TRANSCRIPT TO FOLLOW++
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Former British Prime Minister Tony Blair has warned the UK's official opposition party will be replaced as a serious political force if it doesn't take seriously it's election defeat.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 19, 2019, 9:20 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.