ETV Bharat / sports

విండీస్​-భారత్​ తొలి టీ20కి ఆటంకమేనా..?

author img

By

Published : Nov 22, 2019, 6:21 AM IST

భారత్​-వెస్టిండీస్​ జట్ల మధ్య డిసెంబర్​ 6న జరగనున్న తొలి టీ20కి ఆటంకం ఏర్పడింది. ఈ మ్యాచ్​కు సరిపడా భద్రతను అందించలేమని చెప్పింది ముంబయి పోలీసు విభాగం. అదే రోజున మహా పరినిర్వాణ్​ దివస్​ జరగనుండటమే కారణంగా వెల్లడించారు. అయితే వేదిక మార్చాలా వద్దా అనే అంశంపై శుక్రవారం చర్చలు జరగనున్నాయి.

విండీస్​-భారత్​ తొలి టీ20కి ఆటంకమేనా..?

భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20పై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్‌ నిర్వహణకు సరిపడా భద్రతా సిబ్బందిని కేటాయించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

షెడ్యూల్​ ప్రకారం డిసెంబర్‌ 6న వాంఖడేలో మ్యాచ్‌ జరగాలి. కానీ అది బాబ్రీ మసీద్‌ కూల్చివేసిన దినం. ఇటీవల అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి ఈ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్‌ 6న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి. ఇందుకు వేలాది మంది హాజరై 'మహాపరినిర్వాణ్‌ దివస్‌'గా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను నగరంలో మోహరించాల్సి ఉంటుంది.

మార్పు తప్పదా..!

మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిలో కేవలం 25 శాతం మందిని కేటాయించగలమని పోలీసులు ముంబయి క్రికెట్‌ సంఘానికి వెల్లడించారట. సాధారణంగా ముంబయిలో అంతర్జాతీయ మ్యాచ్‌ భద్రతకు 1200 పోలీసులు, 300 ట్రాఫిక్‌ పోలీసులు అవసరం. పరిస్థితిపై మరింత వివరంగా చర్చించేందుకు ఎంసీఏ అధికారులు... శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బార్వ్‌ను కలవాలని భావిస్తున్నారు. సరిపడా పోలీసులు లేనప్పుడు సొంత ఖర్చులతో ప్రైవేటు రక్షణ సిబ్బంది ఏర్పాట్లపై ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికీ అంగీకరించకపోతే డిసెంబర్‌ 6 మ్యాచ్‌ను హైదరాబాద్‌కు, 11న అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయికి తరలించాలని భావిస్తున్నారట.

భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20పై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్‌ నిర్వహణకు సరిపడా భద్రతా సిబ్బందిని కేటాయించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

షెడ్యూల్​ ప్రకారం డిసెంబర్‌ 6న వాంఖడేలో మ్యాచ్‌ జరగాలి. కానీ అది బాబ్రీ మసీద్‌ కూల్చివేసిన దినం. ఇటీవల అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి ఈ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్‌ 6న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి. ఇందుకు వేలాది మంది హాజరై 'మహాపరినిర్వాణ్‌ దివస్‌'గా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను నగరంలో మోహరించాల్సి ఉంటుంది.

మార్పు తప్పదా..!

మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిలో కేవలం 25 శాతం మందిని కేటాయించగలమని పోలీసులు ముంబయి క్రికెట్‌ సంఘానికి వెల్లడించారట. సాధారణంగా ముంబయిలో అంతర్జాతీయ మ్యాచ్‌ భద్రతకు 1200 పోలీసులు, 300 ట్రాఫిక్‌ పోలీసులు అవసరం. పరిస్థితిపై మరింత వివరంగా చర్చించేందుకు ఎంసీఏ అధికారులు... శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ సంజయ్‌ బార్వ్‌ను కలవాలని భావిస్తున్నారు. సరిపడా పోలీసులు లేనప్పుడు సొంత ఖర్చులతో ప్రైవేటు రక్షణ సిబ్బంది ఏర్పాట్లపై ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికీ అంగీకరించకపోతే డిసెంబర్‌ 6 మ్యాచ్‌ను హైదరాబాద్‌కు, 11న అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయికి తరలించాలని భావిస్తున్నారట.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.