కరోనా ప్రభావంతో వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందులో సినీ రంగం ఒకటి. విదేశాల్లో జరగాల్సిన షూటింగ్లను ప్రస్తుతం వాయిదా వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు నాని 'వి' సినిమా విడుదలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
నాని-సుధీర్బాబు నటిస్తున్న 'వి' సినిమాను తొలుత ఈనెల 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అదే సమయంలో ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం, ఆ వెంటనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనుండటం వల్ల కాస్త ఆలస్యంగా విడుదల చేద్దామని చిత్రబృందం అనుకుంది. అయితే ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గే అవకాశముంది! ఈ నేపథ్యంలో 'వి' సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రాన్ని ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">