నిజమాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దేవాలయాలు, ఇళ్లల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి సాటపూర్ ఎస్బీఐ బ్యాంక్లో పలువురు దోపిడీకి విఫలయత్నం చేశారు.
బ్యాంక్ లాకర్లు తెరుచుకోకపోవడం వల్ల ఫర్నీచర్ని ధ్వంసం చేశారు. బ్యాంక్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఆధారంగా దొంగలను పట్టుకుంటామని బోధన్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. బ్యాంక్ సమయం ముగించుకుని వెళ్లేముందు మేనేజర్లు తాళాలు, లాకర్లు, అలారం సిస్టమ్స్ ను సరిగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి : అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం