నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. భర్తే భార్య ను దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పల్లె శేఖర్రెడ్డి, నాగ శ్రీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ రెండేళ్ల పాప కూడా ఉంది. గత వారం రోజులుగా వీరిద్దరు గోడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున మరోమారు వీరి మధ్య గొడవ జరిగింది. రోకలిబండతో బలంగా నాగశ్రీ తలపై కొట్టాడు శేఖర్. అక్కడికక్కడే ఆమె మృతి చెందగా.. వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు
ఇవీ చూడండి: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త