చైనాకు మాస్క్లతో పాటు అన్ని రకాల వ్యక్తిగత రక్షణ, కొన్ని వైద్య పరికరాలపై విధించిన నిషేధాన్ని భారత్ ఎత్తివేసింది. ప్రాణాంతక కరోనా వైరస్తో పోరాడుతున్న చైనాకు బాసటగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిశ్రీ తెలిపారు.
కరోనా వైరస్పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాసిన ఒక్కరోజు అనంతరం.. అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జనవరి 31న నిషేధం...
ఇప్పటివరకు 900 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్.. అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో గతనెల 31న చైనాకు అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలతో పాటు కొన్ని వైద్య పరికరాలపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా వాటిపై నిషేధాన్ని ఎత్తివేసింది.
ఇదీ చూడండి: కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు