ETV Bharat / international

బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి.. 35 మంది పౌరులు మృతి - బుర్కిన ఫాసోలో ఉగ్రదాడులు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మిన్నంటుతుంటే ఆఫ్రికాలోని ఓ దేశంలో రక్తపాతం సంభవించింది. బుర్కినా ఫాసో దేశంలో జరిగిన ఉగ్రదాడిలో 35 మంది పౌరులు మరణించారు. అందులో ఎక్కువ సంఖ్యలో మహిళలే ఉన్నారు. దాడి అనంతరం చేపట్టిన ఉగ్ర వ్యతిరేక చర్యలో 80 మంది తీవ్రవాదులు మరణించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.

35 civilians killed in double Burkina Faso attack
బుర్కిన ఫాసోలోని అరబిందా పట్టణంలో జిహాదీ తీవ్రవాదుల దాడి
author img

By

Published : Dec 25, 2019, 8:29 AM IST

పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ముష్కరులు రెచ్చిపోయారు. ఉత్తర బుర్కినా ఫాసోలోని అరబిందా పట్టణంలో వరుస దాడులకు పాల్పడ్డారు. పట్టణంలో తీవ్రవాదులు మంగళవారం చేసిన దాడిలో 35 మంది పౌరులు దుర్మరణం చెందారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మార్క్​ క్రిస్టియన్ కబోరే ట్విట్టర్​లో తెలిపారు. వారికి నివాళిగా రెండు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ఉగ్రదాడి మృతులలో 31 మంది మహిళలు ఉన్నట్లు దేశ సమాచార శాఖ మంత్రి స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున జిహాదీ తీవ్రవాదులు అరబిందాలోని సైనిక స్థావరాలు, సాధారణ పౌరులపై విచక్షణా రహితంగా వరుస దాడులకు పాల్పడిందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

ఉగ్రదాడి తర్వాత ముష్కరులను ఏరివేయడానికి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టింది ఆ దేశ సైన్యం. అనంతరం 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఈ దాడిలో ఏడుగురు జవానులు సహా కొంతమంది పౌరులు మరణించినట్లు వెల్లడించింది. 20 మందికిపైగా సైనికులకు గాయాలయ్యాయి.

తాజా దాడులకు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే అల్​ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలే ఈ నరమేథానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ముష్కరులు రెచ్చిపోయారు. ఉత్తర బుర్కినా ఫాసోలోని అరబిందా పట్టణంలో వరుస దాడులకు పాల్పడ్డారు. పట్టణంలో తీవ్రవాదులు మంగళవారం చేసిన దాడిలో 35 మంది పౌరులు దుర్మరణం చెందారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మార్క్​ క్రిస్టియన్ కబోరే ట్విట్టర్​లో తెలిపారు. వారికి నివాళిగా రెండు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ఉగ్రదాడి మృతులలో 31 మంది మహిళలు ఉన్నట్లు దేశ సమాచార శాఖ మంత్రి స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున జిహాదీ తీవ్రవాదులు అరబిందాలోని సైనిక స్థావరాలు, సాధారణ పౌరులపై విచక్షణా రహితంగా వరుస దాడులకు పాల్పడిందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

ఉగ్రదాడి తర్వాత ముష్కరులను ఏరివేయడానికి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టింది ఆ దేశ సైన్యం. అనంతరం 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఈ దాడిలో ఏడుగురు జవానులు సహా కొంతమంది పౌరులు మరణించినట్లు వెల్లడించింది. 20 మందికిపైగా సైనికులకు గాయాలయ్యాయి.

తాజా దాడులకు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే అల్​ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలే ఈ నరమేథానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
WEDNESDAY 25 DECEMBER
THURSDAY 26 DECEMBER
CELEBRITY EXTRA
LONDON_ Nikesh Patel, from the 'Four Weddings and a Funeral' TV show, explains what he posts on social media
PASADENA_ 'Star Wars' star Billy Dee Williams ponders Jungian psychology, mortality
LOS ANGELES_ 'Spies' cast, crew pick espionage film faves
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.