నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపిన లారీల నుంచి డీజిల్ను దొంగిలించి ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో ఉన్న ఆ డీజిల్ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దానికి అనుమతులు లేవని నిర్ధరించారు.
దాదాపు 30 వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఫైటింగ్