ETV Bharat / crime

CBI case: జానకీ ఆగ్రో కంపెనీపై సీబీఐ కేసు - నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన జానకీ ఆగ్రో కంపెనీ

తమకు సంబంధం లేని భూమిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టారన్న అభియోగంపై జానకీ ఆగ్రో (Janaki agro) కంపెనీపై సీబీఐ కేసు (CBI case) నమోదైంది. కంపెనీ యజమాని రాంజీతో పాటు పద్దపాటి పద్మావతి, సంతోష్ యాదవ్ అనే మరో ఇద్దరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది.

Telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Jun 3, 2021, 7:23 AM IST

ఫోర్జరీ సంతకాలు, ధ్రువపత్రాలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న అభియోగంపై జానకీ ఆగ్రో (Janaki agro) కంపెనీపై సీబీఐ కేసు (CBI case) నమోదు చేసింది. కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు నుంచి మాదాపూర్​లోని జానకి ఆగ్రో సుమారు 3 కోట్ల 44 లక్షల రూపాయలను ఆగ్రో కంపెనీ పేరిట రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. కొండాపూర్​లోని 2 వేల 662 గజాల భూమిని కంపెనీ భాగస్వామి కానా విజయలక్ష్మి తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఆ భూమిని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ భూమి కానా విజయలక్ష్మిదే కానీ.. తమకు తనఖా పెట్టిన మహిళ పద్దపాటి పద్మావతి అని బ్యాంకు అధికారులు గుర్తించారు.

తానే విజయలక్ష్మినని ఫోర్జరీ సంతకాలు చేసి మోసానికి పాల్పడినట్లు బ్యాంకు విచారణలో తేలింది. జానకీ ఆగ్రోస్ (Janaki agro) యజమాని రాంజీ, సంతోష్ యాదవ్ అనే మరో వ్యక్తి సహకారంతో మోసం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. విలువ నిర్ధారణ ధ్రువపత్రాలు కూడా ఫోర్జరీవి సమర్పించినట్లు గ్రహించారు. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోర్జరీ సంతకాలు, ధ్రువపత్రాలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న అభియోగంపై జానకీ ఆగ్రో (Janaki agro) కంపెనీపై సీబీఐ కేసు (CBI case) నమోదు చేసింది. కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు నుంచి మాదాపూర్​లోని జానకి ఆగ్రో సుమారు 3 కోట్ల 44 లక్షల రూపాయలను ఆగ్రో కంపెనీ పేరిట రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. కొండాపూర్​లోని 2 వేల 662 గజాల భూమిని కంపెనీ భాగస్వామి కానా విజయలక్ష్మి తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఆ భూమిని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ భూమి కానా విజయలక్ష్మిదే కానీ.. తమకు తనఖా పెట్టిన మహిళ పద్దపాటి పద్మావతి అని బ్యాంకు అధికారులు గుర్తించారు.

తానే విజయలక్ష్మినని ఫోర్జరీ సంతకాలు చేసి మోసానికి పాల్పడినట్లు బ్యాంకు విచారణలో తేలింది. జానకీ ఆగ్రోస్ (Janaki agro) యజమాని రాంజీ, సంతోష్ యాదవ్ అనే మరో వ్యక్తి సహకారంతో మోసం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. విలువ నిర్ధారణ ధ్రువపత్రాలు కూడా ఫోర్జరీవి సమర్పించినట్లు గ్రహించారు. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Krishna Water: 'కృష్ణా బేసిన్​లో నీరు వినియోగించుకునేలా మార్పు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.