ETV Bharat / crime

ఏటీఏంలో అగ్ని ప్రమాదం..రూ.13.30 లక్షల ఆస్తి నష్టం - పామిడిలోని ఏటీఏంలో మంటలు

ఏపీలోని పామిడి పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఏం అగ్ని ప్రమాదంలో దాదాపు రూ. 13.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కట్టర్ ద్వారా ఏటీఏంను తెరవగా మొత్తం రూ. 27.36 లక్షల నగదు లభ్యమైనట్లు వెల్లడించారు. వీటిలో రూ.17.84 లక్షలు పాక్షికంగా, రూ.1.2 లక్షలు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించామన్నారు.

fire in ATM.. huge loss
fire in ATM.. huge loss
author img

By

Published : Apr 12, 2021, 2:48 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో రెండు రోజుల కిందట ఎస్బీఐ ఏటీఏంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారులు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్​తో ప్రమాదం జరిగిందని.. ఇందులో 3 ఏటీఎం యంత్రాలు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు.

కాలిపోయిన ఏటీఏంను.. బ్యాంకు మేనేజర్​తో పాటు స్థానిక సీఐ సమక్షంలో కట్టర్​ ద్వారా తెరవగా.. మొత్తం రూ. 27.36 లక్షల నగదు లభ్యమైనట్లు వెల్లడించారు. వీటిలో రూ.17.84 లక్షలు పాక్షికంగా, రూ.1.2 లక్షలు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించామన్నారు. దాదాపు రూ.13.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి: అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు

ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో రెండు రోజుల కిందట ఎస్బీఐ ఏటీఏంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారులు వెల్లడించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్​తో ప్రమాదం జరిగిందని.. ఇందులో 3 ఏటీఎం యంత్రాలు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు.

కాలిపోయిన ఏటీఏంను.. బ్యాంకు మేనేజర్​తో పాటు స్థానిక సీఐ సమక్షంలో కట్టర్​ ద్వారా తెరవగా.. మొత్తం రూ. 27.36 లక్షల నగదు లభ్యమైనట్లు వెల్లడించారు. వీటిలో రూ.17.84 లక్షలు పాక్షికంగా, రూ.1.2 లక్షలు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించామన్నారు. దాదాపు రూ.13.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి: అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.