1. ముహూర్తం ఖరారు
ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ఆదరణ పొందుతోందని అన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గుడ్ న్యూస్
కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీపై రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేసీఆర్కు ఉత్తమ్ లేఖ
సీఎం కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసుల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ మంత్రి నియోజకవర్గంలోనే ఇప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కేంద్రం ఆదుకోవాలి..
రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తూ... రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సూచించారు. వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడగా... కేంద్రం అడ్డుకోవటం సరికాదన్నారు. సాదాబైనామాల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'సపుత్నిక్-వీ' ట్రయల్స్
రష్యన్ 'స్పుత్నిక్-వీ' రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ఉత్తర్ప్రదేశ్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్ తొలిబ్యాచ్.. వచ్చే వారం కాన్పుర్లోని ఓ మెడికల్ కాలేజీకి రానున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ప్రమాణానికి వేళాయే!
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నితీశ్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సీఎంకు కొరడా దెబ్బలు!
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అలా కొట్టించుకోవడానికి ఓ కారణం ఉంది. ఓ పూజా కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయబద్దంగా ఇలా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. నిరసనలు తీవ్రరూపం
పెరూ అధ్యక్షుడు మాన్యువల్ మెరినోకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. శ్రేయస్ రికార్డు
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అయితే క్రికెట్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్, ధోనీ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు సాధించలేని ఘనతను ఈ యువహిట్టర్ సొంతం చేసుకున్నాడు. అసలింతకీ అతడేం సాధించాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మరో మల్టీస్టారర్..
కింగ్ నాగార్జున, ఆయన కుమారుడు అఖిల్ కలిసి ఓ మల్టీస్టారర్లో నటించబోతున్నారని సమాచారం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.