ప్రభుత్వం మరో లేఖ
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.
ఈనెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్, పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్లకు సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి ఫిర్యాదు చేశారు. అక్రమంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారని లేఖలో సీఎం పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీమ ఎత్తిపోతలకు అనుమతివ్వండి
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ను జూన్ 30వ తేదీన సీడ్యూసీకి అప్లోడ్ చేశామని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సడలింపుల్లో మార్పులు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ సడలింపుల్లో (Curfew Relaxations) ప్రభుత్వం మార్పులు చేసింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతినిచ్చింది. 50 శాతంతో రెస్టారెంట్లు, జిమ్లు, కల్యాణ మండపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హీరోలతో మంత్రి భేటీ.!
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన తనయుడు నయన్ రాజ్లు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో ఎన్టీఆర్ను కలిశారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా భేటీ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ కేసుపై సుప్రీం ఆశ్చర్యం
రద్దు చేసిన ఓ చట్టం కింద ఇంకా కేసులు నమోదు కావటంపై సర్వోన్నత న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 2015లో శ్రేయా సింగాల్ కేసు తీర్పు సందర్భంగా ఐటీ యాక్ట్లో ఓ సెక్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పెట్రో ధరలకు కారణమిదే.!
ఒపెక్ భాగస్వామ్య దేశాల మధ్య పొరపచ్చాలు చమురు ధరల సంక్షోభానికి దారి తీయొచ్చని అంచనాలు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా మధ్య నెలకొన్న విభేదాలు ఇలానే కొనసాగితే.. చమురు ధరలు ఆగస్టులో రికార్డు స్థాయికి పెరగొచ్చని నిపుణులు అంటున్నారు. ఇరు దేశాలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తే... ధరలు భారీగా తగ్గేందుకు కూడా ఆస్కారం ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'గుప్కార్' అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై గుప్కార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ, ఇతర ఖైదీల విడుదల సహా విశ్వాసం నింపే చర్యల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' బీసీసీఐ వెరీ సీరియస్'
ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కచ్చితమైన నిబంధనలు పాటిస్తుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. క్రికెటర్ల గాయాలను ఫిజియోలు గుర్తించడం లేదన్న మాజీ క్రికెటర్ కరీమ్ వ్యాఖ్యలపై ఆ అధికారి స్పందించారు. కరీమ్ వ్యాఖ్యలు గంగూలీ, గిల్ను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బికినీ' బ్యూటీస్
జులై 5న బికినీ డే సందర్భంగా సినీ తారల బికినీ ఫొటోల గ్యాలరీ మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.