ఏపీ అధికారులకు నో ఎంట్రీ
సాగర్లో ఏపీ అధికారులను రాష్ట్ర పోలీసులు వెనక్కి పంపారు. రాష్ట్ర పోలీసులు నూతన వంతెన వద్ద ఏపీ అధికారులను అనుమతించలేదు. విద్యుదుత్పత్తి ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు ఏపీ అధికారులు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మీ వాటా తీసుకెళ్లండి'
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister srinivas Goud) అన్నారు. ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన వారంతా తమ ప్రాంతాలనే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ పేరు పలికేందుకు కూడా ఒప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు అక్కడి అధికారి తనను అవమానపరిచే విధంగా మాట్లాడారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఏకైక సీఎం ఆయనే'
వైసీపీ మాజీ నేత గట్టు శ్రీకాంత్... తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. గట్టు శ్రీకాంత్కు భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెరాస పాలనపై విసుగు చెందిన ఎందరో నాయకులు భాజపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్న బండి సంజయ్... ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పార్లమెంటుకే అధికారాలు
ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసుల్లో నిర్ణయం తీసుకునేందుకు ఒకే విధానం ఉండాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. స్పీకర్లు.. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగపరమైన భావనల మధ్య వారధులుగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అచ్చం సినిమాలానే...!
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలతో అరెస్టైన అసోం ఎమ్మెల్యే అఖిల్ గొగొయి విడుదల కానున్నారు. గొగొయిపై ఉన్న రెండు కేసులను కొట్టివేసింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో ముగ్గురికి విముక్తి లభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ట్విట్టర్కు అంతరాయం
సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. ట్వీట్ షేరింగ్, సెర్చింగ్లో సమస్య తలెత్తినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అమెరికాలో పేలిన చైనా బాంబులు
2 వేల కిలోల చైనా బాంబులు పేలిన ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. సమీపంలోని ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. అమెరికా లాస్ ఏంజెలెస్లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేసేందుకు తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉద్యోగం చేయకుండానే అంత జీతమా?
ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండానే డబ్బులు సంపాదించవచ్చా? రానున్న రోజుల్లో అది ఒక కేరీర్గా మారనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఈ అమ్మాయే నిదర్శనం. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేయకుండానే.. సంస్థ నుంచి 30వేల డాలర్లు(రూ.22 లక్షలు) పారితోషికం తీసుకుంది. మరి ఆ యువతి చేసిన పనేంటి? అంత మొత్తం ఎందుకు చెల్లించారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఖేల్రత్న రేసులో షట్లర్లు
బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), సాయి ప్రణీత్(Sai Praneeth) పేర్లను ఖేల్రత్న(Khel Ratna) పురస్కారానికి సిఫార్సు చేసింది భారత బ్యాడ్మింటన్ సంఘం(BAI). అలాగే అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ అవార్డుల కోసం పేర్లను ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ రూపంలో ఉన్న దేవుడు
వైద్యుల దినోత్సవం(Doctors Day) సందర్భంగా వారి కృషిని మెచ్చుకుంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. 'మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు వాళ్లు' అంటూ రాసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.