ETV Bharat / city

రామోజీ ఇంట కల్యాణం.. వివాహ బంధంతో ఒక్కటైన బృహతి-అక్షయ్‌

author img

By

Published : Apr 16, 2022, 9:54 PM IST

Updated : Apr 17, 2022, 12:59 AM IST

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మనుమరాలు.. ఈనాడు ఎండీ కిరణ్​ - శైలజ దంపతుల రెండో కుమార్తె బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో అత్యంత వైభవంగా జరిగింది. దండమూడి అమర్‌మోహన్ దాస్​ - అనితల కుమారుడు వెంకట్ అక్షయ్‌తో రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభ ముహూర్తాన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై పెళ్లి వేడుక కన్నుల పండువగా సాగింది.

ramoji rao grand daughter brihathi marriage
ramoji rao grand daughter brihathi marriage

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా ఘనంగా జరిగింది. దండమూడి అమర్ మోహన్‌దాస్‌-అనితల కుమారుడు వెంకట్‌ అక్షయ్‌.. ఈనాడు ఎండీ సీహెచ్‌. కిరణ్‌-శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభ ముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి-అక్షయ్‌ పరిణయ వేడుక

అంతకుముందు నూతన వధూవరులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేసి ఆశీర్వదించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోశ్​ కుమార్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్‌బాబు, అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, దర్శకుడు రాజమౌళి, రాజశేఖర్‌-జీవిత దంపతులు, నిర్మాత సురేశ్​బాబు, మంచు విష్ణు దంపతులు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్‌, సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, జూపల్లి రామేశ్వరరావు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా ఘనంగా జరిగింది. దండమూడి అమర్ మోహన్‌దాస్‌-అనితల కుమారుడు వెంకట్‌ అక్షయ్‌.. ఈనాడు ఎండీ సీహెచ్‌. కిరణ్‌-శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభ ముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి-అక్షయ్‌ పరిణయ వేడుక

అంతకుముందు నూతన వధూవరులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేసి ఆశీర్వదించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోశ్​ కుమార్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్‌బాబు, అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, దర్శకుడు రాజమౌళి, రాజశేఖర్‌-జీవిత దంపతులు, నిర్మాత సురేశ్​బాబు, మంచు విష్ణు దంపతులు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్‌, సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, జూపల్లి రామేశ్వరరావు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Last Updated : Apr 17, 2022, 12:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.