మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. గతంలో రామచంద్రపురం అభివృద్ధి చేశామని... ఇంకా పెండింగ్లో ఉన్న పనులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు నిధులు రావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వేరే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: రేపు ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ