లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు సికింద్రాబాద్కు చెందిన ఇంద్ర సేవా సంస్థ ముందుకువచ్చింది. చిలకలగూడలో పలువురు పేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. మహిళలు, చిన్నారులకు స్వయంగా మాస్క్లు తయారుచేసి ఉచితంగా అందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తనవంతుగా సేవ చేసేందుకు ముందుకువచ్చినట్లు సంస్థ నిర్వాహకుడు ఇంద్ర తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.
ఇవీచూడండి: పోలీసుల ఔదార్యం.. నిండు గర్భిణీకి సాయం