దేశంలో చమురు ధరల మంట మండిపోతోంది. మంగళవారం మరోసారి ఇంధన సంస్థలు ధరలను సవరించాయి. ఫలితంగా గత 8 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 సార్లు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 80 పైసలు, డీజిల్పై 70 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. అంతకుముందు అది రూ.99.41 పలికింది. ముంబయిలో వినియోగదారులు లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.115 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.113.61గా ఉంది. ఇలా కొద్ది రోజులుగా పెరుగుతోన్న రేట్లతో వారం వ్యవధిలో ప్రజలపై రూ.4 పైగా భారం పడింది.
ప్రధాన నగరాల్లో చమురు ధరలు..
దిల్లీ: పెట్రోల్ రూ.100.21, డీజిల్ రూ.91.47
ముంబయి: పెట్రోల్ రూ.115.04, డీజిల్ రూ.99.25
చెన్నై: పెట్రోల్ రూ.105.94, డీజిల్ రూ.96
కోల్కతా: పెట్రోల్ రూ.109.68, డీజిల్ రూ.94.62
హైదరాబాద్: పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.84
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ.. గత నవంబర్ నుంచి నాలుగు నెలల పాటు దేశీయ సంస్థలు చమురు ధరలు సవరించలేదు. దాంతో వాటికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ వరుస పెంపుతో ఆ నష్టాల భారం ఇప్పుడు ప్రజలపై పడుతోంది.
ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి