1. 'అన్నిదేశాలకు అందిస్తాం'
వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించినట్లు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారత్ సిద్ధం
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను భారత్లో అత్యవసరంగా వినియోగించేందుకు డీసీజీఐ పచ్చ జెండా ఊపింది. ఈ టీకాలు భద్రం, సురక్షితమని తెలిపింది. రెండు స్వదేశీ టీకాలకు అనుమతి లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది కీలక ముందడుగు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'రోజూ 10 లక్షల మందికి'
హైదరాబాద్ ట్యాంక్బండ్లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్ను మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. బుద్దుడి ఆలోచనలను ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హైదరాబాద్ వచ్చిన ఐష్
బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ ఆదివారం కుటుంబంతో సహా హైదరాబాద్కు వచ్చారు. లాక్డౌన్ విధించిన దాదాపు పది నెలల తర్వాత ఐష్ బయటకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘనపూర్ వద్ద దారుణం జరిగింది. ఉమ్నాపూర్కు చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. 3 రోజుల క్రితం సుజాత, ఆమె బాబును రాము అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'గెలిస్తే రుణాలు మాఫీ'
తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు వివిధ హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తాము అధికారంలోకి వస్తే విద్యా రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'అహంకార ప్రభుత్వం ఏలుతోంది'
అన్నదాతల కష్టాలను పట్టించుకోని అహంకార ప్రభుత్వం మొదటిసారి రాజ్యమేలుతోందని భాజపాను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఎడారిలో కార్ల రేస్
కళ్లు చెదిరే దృశ్యాలు, ప్రమాదకర ఎడారి దారులు, మెరుపు వేగంతో దూసుకెళ్లే రైడర్లు.. ఇవన్నీ కలగలిపిన 2021 దాకర్ రేస్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. రేస్లో పాల్గొనే రైడర్లు జెడ్డాకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీ, పాండ్యాలపై ప్రచారం!
ఆస్ట్రేలియాలో ఇటీవలే పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు కరోనా నిబంధనలు అతిక్రమించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆసీస్ మీడియా సంస్థలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. పట్టుబడ్డ నటి
ముంబయిలోని ఓ హోటల్లో నిన్న రాత్రి ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ టాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.