ETV Bharat / city

ఆత్మకూరులో వార్​ వన్​సైడ్‌.. వైకాపా మెజార్టీ ఎంతంటే..? - Atmakur By Election Counting

Atmakur By Election Counting Today: ఏపీ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైకాపా ఘన విజయం సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా మొత్తం 20 రౌండ్లు పూర్తయ్యేసరికి.. భాజపాపై 82,888 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి సత్తా చాటారు. తొలి రౌండ్‌ నుంచి విక్రమ్‌రెడ్డి పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు.

atmakur-by-election-counting-arrangements
atmakur-by-election-counting-arrangements
author img

By

Published : Jun 26, 2022, 8:50 AM IST

Updated : Jun 26, 2022, 12:07 PM IST

Atmakur By Election Counting Today: ఏపీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.

ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్‌ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు.

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217
వైకాపా : 167
భాజపా : 21
బీఎస్పీ : 7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా : 3

Atmakur By Election Counting Today: ఏపీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.

ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్‌ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు.

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217
వైకాపా : 167
భాజపా : 21
బీఎస్పీ : 7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా : 3

Last Updated : Jun 26, 2022, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.