ETV Bharat / business

లాక్​డౌన్​ వేళ ఆ రాష్ట్రంలోనే ఎక్కువ సైబర్​ నేరాలు - cybercrimes in Kerala

కరోనా లాక్​డౌన్​ కాలంలో అత్యధికంగా కేరళలోనే సైబర్​ నేరాలు నమోదైనట్లు ఓ సంస్థ చేసిన విశ్లేషణలో తేలింది. సైబర్​ దాడులకు గురైన జాబితాలో కేరళ తర్వాత పంజాబ్​, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. కరోనా భయాలను ఆసరాగా చేసుకొని వ్యక్తుల నుంచి సంస్థల వరకు సైబర్ మోసగాళ్లు దోచుకున్నారని వెల్లడించింది.

Kerala records highest number of cyberattacks during lockdown
దేశంలో సైబర్​ నేరాలు.. ఆ రాష్ట్రంలోనే అత్యధికం!
author img

By

Published : May 21, 2020, 6:17 PM IST

లాక్​డౌన్ వేళ దేశంలో సైబర్​ నేరాలు అధికమయ్యాయి. ఈ నేరాలను ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్​ ప్రొవైడర్​ కే7 కంప్యూటింగ్ విశ్లేషించింది. డేటా ప్రకారం కేరళ ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సగటున 250 మంది..

చిన్న నగరాల్లో 10,000 మంది వినియోగదారుల్లో సగటున 250 మందిపై సైబర్ ​దాడులు జరిగాయని కే7 సంస్థ తెలిపింది. కేరళలోని కొట్టాయం (462), కన్నూర్ (437)​, కొల్లాం (236), కొచ్చిలో (147) అత్యధికంగా దాడులు జరిగాయని తెలిపింది. ఇలా 2,000 సైబర్​ క్రైమ్స్​తో దేశంలోనే అగ్రస్థానంలో కేరళ ఉందని వెల్లడించింది. ఈ జాబితాలో కపంజాబ్​ (207), తమిళనాడు (184) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయని సంస్థ తెలిపింది.

కరోనా పేరుతో..!

2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్​ నెల మధ్య వరకు జరిగిన దాడులను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు. కరోనా భయాలను ఆసరాగా తీసుకొని సంస్థలు, వ్యక్తులను సైబర్ మోసగాళ్లు దోచుకున్నారని వెల్లడించింది. కంప్యూటర్లు, మొబైల్​ ఫోన్​లే లక్ష్యంగా దాడులు చేసి వినియోగదారుల రహస్య సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను యాక్సెస్​ చేసి సైబర్​దాడులుకు పాల్పడ్డారని నివేదించింది.

మాల్​వేర్ లింక్​లు పంపి..

'కొవిడ్​-19 సమాచారానికి సంబంధించి నకిలీ యాప్​లు సృష్టించి.. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ట్రెజరీ విభాగం పేరుతో మాల్​వేర్​ లింక్​లు పంపిస్తారు. కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజల్లో భయాన్ని కలిగిస్తారు. ఇలా వినియోగదారుల సున్నిత డేటాను సేకరించి దాడులు చేస్తున్నారు. విద్యావంతులే అధికంగా ఈ దాడులకు గురయ్యారు.' అని కే7 తెలిపింది.

ఇదీ చూడండి: ఆ నిధిపై కాంగ్రెస్ ట్వీట్- సోనియాపై కేస్

లాక్​డౌన్ వేళ దేశంలో సైబర్​ నేరాలు అధికమయ్యాయి. ఈ నేరాలను ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్​ ప్రొవైడర్​ కే7 కంప్యూటింగ్ విశ్లేషించింది. డేటా ప్రకారం కేరళ ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సగటున 250 మంది..

చిన్న నగరాల్లో 10,000 మంది వినియోగదారుల్లో సగటున 250 మందిపై సైబర్ ​దాడులు జరిగాయని కే7 సంస్థ తెలిపింది. కేరళలోని కొట్టాయం (462), కన్నూర్ (437)​, కొల్లాం (236), కొచ్చిలో (147) అత్యధికంగా దాడులు జరిగాయని తెలిపింది. ఇలా 2,000 సైబర్​ క్రైమ్స్​తో దేశంలోనే అగ్రస్థానంలో కేరళ ఉందని వెల్లడించింది. ఈ జాబితాలో కపంజాబ్​ (207), తమిళనాడు (184) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయని సంస్థ తెలిపింది.

కరోనా పేరుతో..!

2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్​ నెల మధ్య వరకు జరిగిన దాడులను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు. కరోనా భయాలను ఆసరాగా తీసుకొని సంస్థలు, వ్యక్తులను సైబర్ మోసగాళ్లు దోచుకున్నారని వెల్లడించింది. కంప్యూటర్లు, మొబైల్​ ఫోన్​లే లక్ష్యంగా దాడులు చేసి వినియోగదారుల రహస్య సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను యాక్సెస్​ చేసి సైబర్​దాడులుకు పాల్పడ్డారని నివేదించింది.

మాల్​వేర్ లింక్​లు పంపి..

'కొవిడ్​-19 సమాచారానికి సంబంధించి నకిలీ యాప్​లు సృష్టించి.. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ట్రెజరీ విభాగం పేరుతో మాల్​వేర్​ లింక్​లు పంపిస్తారు. కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజల్లో భయాన్ని కలిగిస్తారు. ఇలా వినియోగదారుల సున్నిత డేటాను సేకరించి దాడులు చేస్తున్నారు. విద్యావంతులే అధికంగా ఈ దాడులకు గురయ్యారు.' అని కే7 తెలిపింది.

ఇదీ చూడండి: ఆ నిధిపై కాంగ్రెస్ ట్వీట్- సోనియాపై కేస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.