అందుబాటు ధర స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించేందుకు రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నామని.. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని గూగుల్ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అయిన సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
గతేడాది జియో ప్లాట్ఫామ్స్లో 7.7 శాతం వాటాను రూ. 33,737 కోట్లతో గూగుల్ కొనుగోలు చేసింది. అదే సమయంలో ఒక ప్రారంభ స్థాయి, అందుబాటు ధర స్మార్ట్ఫోన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయటం కోసం ఒక వాణిజ్య ఒప్పందాన్నీ అప్పట్లోనే జియోతో కుదుర్చుకుంది.
సాంకేతికత వేగాన్ని పెంచటం కోసం..
ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన కొంత మంది విలేకర్లతో గురువారం జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో స్మార్ట్ఫోన్ రూపొందిస్తున్నామనే విషయాన్ని పిచాయ్ స్పష్టం చేశారు. ఆ ఫోన్ను ఎప్పుడు విడుదల చేస్తారు, ధర వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. భారత్లో డిజిటల్ సాంకేతికత వేగాన్ని పెంచటం కోసం ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద వచ్చే 5-7 ఏళ్ల వ్యవధిలో రూ. 75,000 కోట్ల(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెడతాయని గతేడాది జులైలో పిచాయ్ తెలిపిన సంగతి విదితమే.
'ఐడీఎఫ్ నుంచి కొత్త అవకాశాలపై నిధులు పెట్టడానికి చూస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఇందుకు సంబంధించి మరికొన్ని ప్రకటనలు చేస్తాం' అని పిచాయ్ అన్నారు.
ఇదీ చదవండి : సుంకం లేకుండా 'యాంఫోటెరిసిన్-బీ' దిగుమతి!