ఫాన్స్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో మొదటి సారిగా ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకురానుంది. మేఘన్ ఈ టెక్ పేరుతో వస్తున్న ఈ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికంటే ముందుగా వాహనానికి సంబంధించి వెనుకభాగాన్ని విడుదల చేసింది. అయితే ఈ ఏడాది చివరికి దీని పూర్తి స్థాయి అవుట్లుక్ బయటకు వస్తుందని సంస్థ తెలిపింది. 2025 నాటికి 24 కొత్త మోడళ్లను విడుదల చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం.. వాటిలో మేఘన్ ఈ టెక్ ఒకటని పేర్కొంది.
రెనో విడుదల చేసిన దానిలో కారు పేరుతో పాటు లోగో ఉంది. ఇందులో చివరిగా ఉండే అక్షరం బంగారు రంగులో కనిపిస్తోంది. సైడ్ లైట్లు మొత్తంగా కారునే చుట్టేసేలా ఉన్నాయి. వీటి మధ్యలో లోగోని ఉంచారు.
రెనో తీసుకువస్తున్న మేఘన్ ఈ-టెక్ వాహనం సీఎంఎఫ్-ఈవీ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఇదే ఫ్లాట్ఫామ్ ఆధారంగానే ఇతర సంస్థలు కూడా వాహనాలను తీసుకువచ్చాయి. ఈ వాహనం పొడవు నాలుగు మీటర్లు వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
ప్రత్యేకతలు..
- 217 హార్స్పవర్
- 300 ఎన్ఎమ్ ఎలక్ట్రిక్ మోటారు
- 8 సెకన్లలోపే 100 కిమీ వేగాన్ని పుంజుకొగలదు
- 60 కిలోవాట్ల బ్యాటరీ
- సింగిల్ ఛార్జ్లో సుమారు 450 కి.మీ ప్రయాణం
ఇదీ చూడండి: కారు కొనాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..