భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)కి ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతిష్ఠాత్మక "ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు" లభించింది. ప్రజల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పించినందుకుగానూ ఈ పురస్కారాన్ని ఐసీఏఆర్ సొంతం చేసుకుంది.
గత ఏడాది డిసెంబర్లో భూసార పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భారీ అవగాహన కార్యక్రమాన్ని ఐసీఏఆర్ నిర్వహించింది. జనవరిలో బ్యాంకాక్లో జరిగే అధికారిక కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు.
ఇదీ చూడండి: 397ఏళ్ల అనంతరం.. ఆకాశంలో మరో అద్భుతం!