ETV Bharat / bharat

'ఆర్మీ' పేపర్​ లీక్​: సికింద్రాబాద్ కల్నలే సూత్రధారి! - ఆర్మీ పేపర్ లీక్ కేసులో సికింద్రబాద్ కల్నల్ అరెస్ట్

ఆర్మీ పరీక్షా పత్రం లీకైన కేసులో అరెస్టైన సికింద్రాబాద్​కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగత్​ప్రీత్​ సింగ్ బేడీ(44) అనే ఉన్నతస్థాయి సైనికాధికారిని ప్రధాన నిందితునిగా పోలీసులు నిర్ధరించారు. ఆర్మీ పరీక్ష పత్రాల లీకేజీతో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28న జరగాల్సిన ప్రవేశ పరీక్ష రద్దయింది.

Army exam paper
ఆర్మీ
author img

By

Published : May 18, 2021, 10:07 PM IST

ఆర్మీ పరీక్షా పత్రం లీకైన కేసులో అరెస్టైన సికింద్రాబాద్​కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగత్​ప్రీత్​ సింగ్ బేడీ(44) అనే ఉన్నతస్థాయి సైనికాధికారిని ప్రధాన నిందితునిగా తేల్చారు పోలీసులు. స్థానిక పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ముద్రించే బాధ్యతను నిర్వహించిన బేడీకి.. నార్నెపాటి వరప్రసాద్ అనే వ్యక్తి సహకరించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు.

లీకేజీ ఇలా..

సికింద్రాబాద్​ ఏఓసీ కేంద్రంలో పేపర్ ప్రింటింగ్ బాధ్యతలు చూస్తున్న బేడీ.. పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి విఠల్ పాటిల్ వివరించారు. ప్రింటింగ్ సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా పేపర్​ను పొందిన బేడీ.. దానిని సికింద్రాబాద్​లోని ఓ హోటల్​లో ఉన్న వరప్రసాద్​కు పంపినట్లు గుర్తించారు. అతని నుంచి నర్సింగ్​రావు అనే వ్యక్తికి.. అనంతరం పవన్‌ అనే వ్యక్తికి పేపర్​ చేరగా.. పవన్ దీనిని విలాస్ కిలారి అనే మేజర్ ర్యాంక్ అధికారికి పంపించాడు. అతని నుంచి మరో ప్రధానాధికారి అయిన తిరుమురుగన్ తంగవేలుకు చేరవేసినట్లు పోలీసులు వివరించారు.

డబ్బులు వెనక్కి..

ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష రూపాయలు బేడీకి అందాల్సి ఉండగా.. కొంత డబ్బును అడ్వాన్సుగా తీసుకున్నాడు. అయితే పరీక్ష రద్దైనందున వారికి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. పుణె కోర్టు బేడీకి మే 25 వరకు పోలీసు కస్టడీ విధించింది.

ఈ లీకేజీ వ్యవహారంతో.. దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బంది నియామకం కోసం ఫిబ్రవరి 28న జరగాల్సిన ప్రవేశ పరీక్షను రద్దు చేసింది ఆర్మీ.

ఇవీ చదవండి: 'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు

పేపర్​ లీక్ కేసులో ఆర్మీ అధికారి అరెస్టు

ఆర్మీ పరీక్షా పత్రం లీకైన కేసులో అరెస్టైన సికింద్రాబాద్​కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగత్​ప్రీత్​ సింగ్ బేడీ(44) అనే ఉన్నతస్థాయి సైనికాధికారిని ప్రధాన నిందితునిగా తేల్చారు పోలీసులు. స్థానిక పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ముద్రించే బాధ్యతను నిర్వహించిన బేడీకి.. నార్నెపాటి వరప్రసాద్ అనే వ్యక్తి సహకరించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు.

లీకేజీ ఇలా..

సికింద్రాబాద్​ ఏఓసీ కేంద్రంలో పేపర్ ప్రింటింగ్ బాధ్యతలు చూస్తున్న బేడీ.. పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి విఠల్ పాటిల్ వివరించారు. ప్రింటింగ్ సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా పేపర్​ను పొందిన బేడీ.. దానిని సికింద్రాబాద్​లోని ఓ హోటల్​లో ఉన్న వరప్రసాద్​కు పంపినట్లు గుర్తించారు. అతని నుంచి నర్సింగ్​రావు అనే వ్యక్తికి.. అనంతరం పవన్‌ అనే వ్యక్తికి పేపర్​ చేరగా.. పవన్ దీనిని విలాస్ కిలారి అనే మేజర్ ర్యాంక్ అధికారికి పంపించాడు. అతని నుంచి మరో ప్రధానాధికారి అయిన తిరుమురుగన్ తంగవేలుకు చేరవేసినట్లు పోలీసులు వివరించారు.

డబ్బులు వెనక్కి..

ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష రూపాయలు బేడీకి అందాల్సి ఉండగా.. కొంత డబ్బును అడ్వాన్సుగా తీసుకున్నాడు. అయితే పరీక్ష రద్దైనందున వారికి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. పుణె కోర్టు బేడీకి మే 25 వరకు పోలీసు కస్టడీ విధించింది.

ఈ లీకేజీ వ్యవహారంతో.. దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బంది నియామకం కోసం ఫిబ్రవరి 28న జరగాల్సిన ప్రవేశ పరీక్షను రద్దు చేసింది ఆర్మీ.

ఇవీ చదవండి: 'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు

పేపర్​ లీక్ కేసులో ఆర్మీ అధికారి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.