ETV Bharat / bharat

స్వీడన్ ప్రధానితో మోదీ స్నేహగీతం - స్వీడన్​ ప్రధాని స్టీఫన్​ లోఫ్​వెన్​తో మోదీ భేటీ

సాంకేతిక, పరిశోధన రంగాల్లో భారత్​-స్వీడన్​ మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వీడన్​ ప్రధాని స్టీఫన్​ లోఫ్​వెన్​తో వర్చువల్​గా భేటీ అయ్యారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టాలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించినట్లు చెప్పారు.

Modi at virtual summit with Swedish PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Mar 5, 2021, 4:17 PM IST

Updated : Mar 5, 2021, 5:00 PM IST

భారత్​, స్వీడన్​ దేశాలు స్మార్ట్​ సిటీలు, ఈ-మొబిలిటీ, స్మార్ట్​ గ్రిడ్స్​, వ్యర్థాల నిర్వహణ వంటి పలు రంగాల్లో సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ మార్పులు వంటి ప్రాధాన్యాంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

స్వీడన్​ ప్రధాని స్టీఫన్​ లోఫ్​వెన్​తో వర్చువల్​గా సమావేశమయ్యారు​ మోదీ. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టాలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించినట్లు చెప్పారు.

"ఆవిష్కరణలు, సాంకేతికత, పెట్టుబడులు, అంకురాలు, పరిశోధనల్లో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాం. స్మార్ట్​ సిటీలు, నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వాహణ, స్మార్ట్​ గ్రిడ్స్​, ఈ-మొబిలిటీ, డిజిటల్​ ట్రాన్స్​ఫర్​మేషన్​ వంటి ఇతర కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నాం.

ఇరు దేశాలకు పర్యావరణ మార్పులు అనేది ప్రాధాన్యాంశం. ఈ విషయంపై ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రాముఖ్యాన్ని భారతదేశ సంస్కృతి ఎల్లప్పుడూ నొక్కి చెబుతుంది. పారిస్​ ఒప్పందం ప్రకారం కట్టుబడి ముందుకు సాగుతాం. ఈ లక్ష్యాలను సాధించటమే కాకుండా.. వాటిని మరింత విస్తరిస్తాం. జీ-20 దేశాల్లో భారత్​ తన లక్ష్యాలను చేరుకోవటంలో మంచి పురోగతి సాధించింది. గడిచిన 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం 162 శాతం పెరిగింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

150 దేశాలకు భారత ఔషధాలు

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో 150కిపైగా దేశాలకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర సామగ్రిని భారత్​ అందించిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో తయారైన కొవిడ్​-19 వ్యాక్సిన్​ను సుమారు 50 దేశాలకు పంపినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: పరీక్షల భయం పోగొట్టడంపై మోదీ కొత్త పుస్తకం

భారత్​, స్వీడన్​ దేశాలు స్మార్ట్​ సిటీలు, ఈ-మొబిలిటీ, స్మార్ట్​ గ్రిడ్స్​, వ్యర్థాల నిర్వహణ వంటి పలు రంగాల్లో సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ మార్పులు వంటి ప్రాధాన్యాంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

స్వీడన్​ ప్రధాని స్టీఫన్​ లోఫ్​వెన్​తో వర్చువల్​గా సమావేశమయ్యారు​ మోదీ. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టాలు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించినట్లు చెప్పారు.

"ఆవిష్కరణలు, సాంకేతికత, పెట్టుబడులు, అంకురాలు, పరిశోధనల్లో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నాం. స్మార్ట్​ సిటీలు, నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వాహణ, స్మార్ట్​ గ్రిడ్స్​, ఈ-మొబిలిటీ, డిజిటల్​ ట్రాన్స్​ఫర్​మేషన్​ వంటి ఇతర కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నాం.

ఇరు దేశాలకు పర్యావరణ మార్పులు అనేది ప్రాధాన్యాంశం. ఈ విషయంపై ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రాముఖ్యాన్ని భారతదేశ సంస్కృతి ఎల్లప్పుడూ నొక్కి చెబుతుంది. పారిస్​ ఒప్పందం ప్రకారం కట్టుబడి ముందుకు సాగుతాం. ఈ లక్ష్యాలను సాధించటమే కాకుండా.. వాటిని మరింత విస్తరిస్తాం. జీ-20 దేశాల్లో భారత్​ తన లక్ష్యాలను చేరుకోవటంలో మంచి పురోగతి సాధించింది. గడిచిన 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం 162 శాతం పెరిగింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

150 దేశాలకు భారత ఔషధాలు

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో 150కిపైగా దేశాలకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర సామగ్రిని భారత్​ అందించిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో తయారైన కొవిడ్​-19 వ్యాక్సిన్​ను సుమారు 50 దేశాలకు పంపినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: పరీక్షల భయం పోగొట్టడంపై మోదీ కొత్త పుస్తకం

Last Updated : Mar 5, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.