ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో మెరుపు వరద వల్ల పవర్ ప్రాజెక్టులో పనిచేస్తోన్న 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. అయితే.. ఆ రాష్ట్రంలో ఇలాంటి పెను విషాద ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.
1991- ఉత్తరకాశీ భూకంపం
6.8 తీవ్రతతో 1991 అక్టోబర్లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 768 మంది ప్రాణాలు కోల్పయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
1998- మల్పా దుర్ఘటన
పితోర్గఢ్ జిల్లా మల్పాలో కొండచరియలు విరిగిపడి 225 మంది ప్రాణాలు కోల్పాయారు. వారిలో 55 మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు. కొండచరియలు పడడం వల్ల శర్దా నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.
1999- చమోలీ భూకంపం
1999లో చమోలీలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 100 మందికిపైగా బలయ్యారు. పక్కనే ఉన్న రుద్రప్రయాగ్ జిల్లా కూడా ఈ భూకంపం ధాటికి ప్రభావితమైంది. పలు రహదారులు, నదీమార్గాలు దెబ్బతిన్నాయి.
2013- వరదలు
2013, జూన్లో సంభవించిన వరదల వల్ల రికార్డు స్థాయిలో 5,700 మంది విగతజీవులుగా మారినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ వరదల ధాటికి చార్ ధామ్ తీర్థయాత్రకు వెళ్లే మార్గాల్లో 3 లక్షలకు పైగా జనం చిక్కుకున్నారు. అనేక వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.