ETV Bharat / bharat

అడ్రస్​ మారిన మృతదేహం- అంత్యక్రియలయ్యాక వెలుగులోకి.. - బెళగావి జిల్లాస్పత్రిలో అడ్రస్​ మారిన కొవిడ్​ మృతదేహం

కర్ణాటకలో ఓ వింత ఘటన జరగింది. చనిపోయిన కొవిడ్​ బాధితుడి మృతదేహాన్ని మరో ఇంటికి పంపించారు ఆస్పత్రి సిబ్బంది. అంత్యక్రియలన్నీ పూర్తయ్యాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Corona dead body
కొవిడ్​ మృతదేహం
author img

By

Published : May 4, 2021, 2:38 PM IST

కర్ణాటకలో చనిపోయిన కరోనా రోగిని.. వాళ్ల ఇంటికి పంపకుండా, పొరపాటున మరో చిరునామాకు పంపించారు ఆస్పత్రి సిబ్బంది.

ఏం జరిగిందంటే.?

బెళగావి జిల్లాలోని కగావాడ తాలుకా, మోళ్​ గ్రామానికి చెందిన పాయప్ప సత్యప్ప హల్లోల్లి(82) ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన్ను మే 1న జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆ మరుసటి రోజే పాయప్ప మృతిచెందారని చెబుతూ.. ఓ మృతదేహాన్ని ప్యాక్​ చేసి ఇంటికి పంపారు ఆస్పత్రి సిబ్బంది.

కరోనా కారణంగా చనిపోవడం వల్ల.. ఆ మృతదేహాన్ని చూడకుండానే అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత పాయప్ప బతికే ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో సదరు కుటుంబం షాక్​ తింది.

ఆ తర్వాత ఆరా తీస్తే.. మృతదేహం అదే జిల్లాలోని గోకాక్ పట్టణానికి చెందిన మయప్ప మావరాకర(71)దని తేలింది.

ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు రోగులు మృతి

కర్ణాటకలో చనిపోయిన కరోనా రోగిని.. వాళ్ల ఇంటికి పంపకుండా, పొరపాటున మరో చిరునామాకు పంపించారు ఆస్పత్రి సిబ్బంది.

ఏం జరిగిందంటే.?

బెళగావి జిల్లాలోని కగావాడ తాలుకా, మోళ్​ గ్రామానికి చెందిన పాయప్ప సత్యప్ప హల్లోల్లి(82) ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన్ను మే 1న జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆ మరుసటి రోజే పాయప్ప మృతిచెందారని చెబుతూ.. ఓ మృతదేహాన్ని ప్యాక్​ చేసి ఇంటికి పంపారు ఆస్పత్రి సిబ్బంది.

కరోనా కారణంగా చనిపోవడం వల్ల.. ఆ మృతదేహాన్ని చూడకుండానే అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత పాయప్ప బతికే ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో సదరు కుటుంబం షాక్​ తింది.

ఆ తర్వాత ఆరా తీస్తే.. మృతదేహం అదే జిల్లాలోని గోకాక్ పట్టణానికి చెందిన మయప్ప మావరాకర(71)దని తేలింది.

ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.