తమిళనాడు విల్లుపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు పిల్లలను చంపి, భార్యాభర్తలు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను మోహన్(38), విమలశ్రీ(32), రాజశ్రీ(8), నిత్యశ్రీ(7), శివబాలన్(5)గా అధికారులు గుర్తించారు.
'వలవనూర్ పుడుపాలయంకు చెందిన మోహన్ కార్పెంటర్ పని చేసేవాడు. కరోనా కారణంగా పని లేకుండా పోయింది. అందుకే మోహన్.. ఇంటిని తాకట్టు పెట్టి రూ.50 లక్షలు అప్పు చేసి ఓ వ్యాపారం ప్రారంభించాడు. అయితే లాభాలు రాకపోవడం వల్ల వడ్డీ కట్టలేక.. ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యాడు. దీంతో కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు' అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి: రూ.24 లక్షల నీటి బిల్లు బాకీపడ్డ సీఎం, మంత్రులు