ETV Bharat / bharat

కాంగ్రెస్​కు పైలట్ షాక్​​- పతనం అంచుల్లో గహ్లోత్​ సర్కార్​! - Rajasthan latest news

Power games in Rajasthan, Cong MLAs meet Gehlot to indicate support
హస్తినలో మంతనాలు- రసవత్తరంగా రాజస్థాన్​ రాజకీయం
author img

By

Published : Jul 12, 2020, 6:38 PM IST

Updated : Jul 12, 2020, 10:39 PM IST

22:28 July 12

రాజస్థాన్​ సర్కార్​ పతనం అంచుల్లో ఉంది. డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గహ్లోత్​ సర్కార్​కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా సచిన్​ పైలట్​ తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని... బహిరంగంగానే తెలిపారు. గహ్లోత్​ సర్కార్​ మైనార్టీలో ఉందన్నారు. రేపు జరగబోయే పార్టీ శాసనసభా సమావేశానికి హాజరుకానని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సమావేశం పూర్తయ్యాక పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి ఏమీ కాదని విశ్వాసం వ్యక్తం చేశారు.

పైలట్​ కీలకం...

ఈ రోజు తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీ వెళ్లారు పైలట్​. మధ్యప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్​ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. అనంతరం సింధియా... రాజస్థాన్ సర్కార్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. పైలట్​ను చిన్నచూపు చూస్తున్నారంటూ ట్వీట్​ చేశారు. 

పైలట్‌ బలమెంత?

యువ నాయకుడు సచిన్‌ పైలట్‌కు 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. మరికొందరు స్వతంత్రులు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు సమాచారం. సచిన్‌ పైలట్‌ తీసుకునే నిర్ణయం ఏదైనా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్‌ పైలట్‌ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్‌ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. 

20:52 July 12

సోమవారం ఉదయం సీఎం అశోక్​ గహ్లోత్​ నివాసంలో నిర్వహించే కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశానికి సచిన్​ పైలట్​ హాజరుకావడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

20:02 July 12

శాసనసభాపక్ష సమావేశం

కరోనా వేళ రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ యువనేత సచిన్‌ పైలట్‌.. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీకి చేరడం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. సీఎం గహ్లోత్‌ నివాసంలో ఈ భేటీ జరగనుంది. తొలుత ఆదివారం రాత్రే ఈ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ వాయిదా పడింది. రాజస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపింది. ఆ పార్టీ నేతలు అజయ్‌ మాకెన్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా రేపు జరగబోయే శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకానున్నారు.

ముదిరిన విభేదాలు?

రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా య‌త్నిస్తోందంటూ శనివారం అశోక్ గహ్లోత్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ తరుణంలో ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో కలిసి దిల్లీ వెళ్ల‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. ఇరువురి మధ్య తొలి నుంచి ఉన్న విభేదాలు గతకొంత కాలంగా తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఇటీవల పార్టీ అధిష్ఠానానికి కూడా వివరించినట్లు సమాచారం. కావాలనే గహ్లోత్‌ తనని దూరం పెడుతున్నారని అధినాయకత్వం ముందు వాపోయారట. ఈ పరిణామాల నేపథ్యంలో సచిన్‌ భాజపాకు సన్నిహితంగా మెలుగుతున్నట్లు కొంతమంది కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.

ఆ నోటీసే కొంపముంచిందా..?

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌కు ఇటీవల స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసే సచిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు ఆయన మద్దతు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ లేఖతో సచిన్‌ విషయంలో ముఖ్యమంత్రి తన పరిధి దాటి వ్యవహరించినట్లు వారంతా భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాతావరణంలో తాము గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేసే పరిస్థితులు లేవని వారు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సచిన్‌ మద్దతు వర్గం గురుగ్రామ్‌లోని వివిధ రిసార్టులకు చేరినట్లు సమాచారం.

దీనిపై వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తనకు కూడా ఎస్‌వోజీ నుంచి నోటీసులు అందాయని తెలిపారు. ఈ నోటీసు వల్లే సచిన్‌ అసంతృప్తి గురయ్యారంటూ ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఎస్‌వోజీకి ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు భాజపా నేతల్ని ఎస్‌వోజీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో రాజ్యసభ ఎన్నిల సమయంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వీటి ఆధారంగానే సచిన్‌కు నోటీసులు పంపినట్లు జైపుర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పైలట్‌ బలమెంత?

యువ నాయకుడు సచిన్‌ పైలట్‌కు 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. మరికొందరు స్వతంత్రులు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు సమాచారం. సచిన్‌ పైలట్‌ తీసుకునే నిర్ణయం ఏదైనా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్‌ పైలట్‌ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్‌ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. వాస్తవంగా సచిన్‌ వెంట ఉన్నది ఎందరు? ప్రభుత్వం నిలుస్తుందా? వంటి ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానం రానుంది.

19:11 July 12

భాజపాపై విమర్శలు...

ప్రభుత్వంలో అనిశ్చితిపై రాష్ట్ర కేబినెట్​ మంత్రి హరీశ్​ చౌదరీ భాజపాపై విమర్శలు చేశారు. రాజస్థాన్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఐదేళ్ల పాలను పూర్తి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

19:09 July 12

శాసనసభ్యులతో భేటీ...

ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సీఎం గహ్లోత్​ సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.

19:03 July 12

మరో మలుపు...

రాజస్థాన్​ రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం గహ్లోత్​పై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ చేతిలో 30 మంది కాంగ్రెస్​ సహా స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. పైలట్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వీరు ఆయన వెంటే ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

18:23 July 12

హస్తినలో మంతనాలు- రసవత్తరంగా రాజస్థాన్​ రాజకీయం

రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు ఉత్కంఠకర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన మరుసటి రోజే ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో దిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తనను త‌ప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ స‌చిన్‌ పైల‌ట్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితిని సోనియా గాంధీతోపాటు రాహుల్‌ను క‌లిసి వివ‌రించ‌నున్నట్లు స‌మాచారం. తమకు దాదాపు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సచిన్‌ వర్గం చెబుతోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ మద్దతుదారులు మాత్రం స‌చిన్ పైల‌ట్ భారతీయ జనతా పార్టీకి స‌న్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజ‌స్థాన్‌లోనూ ఆ పార్టీ పావులు క‌దుపుతోందని విమర్శిస్తున్నారు.

22:28 July 12

రాజస్థాన్​ సర్కార్​ పతనం అంచుల్లో ఉంది. డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గహ్లోత్​ సర్కార్​కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా సచిన్​ పైలట్​ తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని... బహిరంగంగానే తెలిపారు. గహ్లోత్​ సర్కార్​ మైనార్టీలో ఉందన్నారు. రేపు జరగబోయే పార్టీ శాసనసభా సమావేశానికి హాజరుకానని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సమావేశం పూర్తయ్యాక పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి ఏమీ కాదని విశ్వాసం వ్యక్తం చేశారు.

పైలట్​ కీలకం...

ఈ రోజు తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీ వెళ్లారు పైలట్​. మధ్యప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్​ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. అనంతరం సింధియా... రాజస్థాన్ సర్కార్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. పైలట్​ను చిన్నచూపు చూస్తున్నారంటూ ట్వీట్​ చేశారు. 

పైలట్‌ బలమెంత?

యువ నాయకుడు సచిన్‌ పైలట్‌కు 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. మరికొందరు స్వతంత్రులు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు సమాచారం. సచిన్‌ పైలట్‌ తీసుకునే నిర్ణయం ఏదైనా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్‌ పైలట్‌ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్‌ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. 

20:52 July 12

సోమవారం ఉదయం సీఎం అశోక్​ గహ్లోత్​ నివాసంలో నిర్వహించే కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశానికి సచిన్​ పైలట్​ హాజరుకావడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

20:02 July 12

శాసనసభాపక్ష సమావేశం

కరోనా వేళ రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ యువనేత సచిన్‌ పైలట్‌.. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీకి చేరడం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. సీఎం గహ్లోత్‌ నివాసంలో ఈ భేటీ జరగనుంది. తొలుత ఆదివారం రాత్రే ఈ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ వాయిదా పడింది. రాజస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపింది. ఆ పార్టీ నేతలు అజయ్‌ మాకెన్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా రేపు జరగబోయే శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకానున్నారు.

ముదిరిన విభేదాలు?

రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా య‌త్నిస్తోందంటూ శనివారం అశోక్ గహ్లోత్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ తరుణంలో ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో కలిసి దిల్లీ వెళ్ల‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. ఇరువురి మధ్య తొలి నుంచి ఉన్న విభేదాలు గతకొంత కాలంగా తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఇటీవల పార్టీ అధిష్ఠానానికి కూడా వివరించినట్లు సమాచారం. కావాలనే గహ్లోత్‌ తనని దూరం పెడుతున్నారని అధినాయకత్వం ముందు వాపోయారట. ఈ పరిణామాల నేపథ్యంలో సచిన్‌ భాజపాకు సన్నిహితంగా మెలుగుతున్నట్లు కొంతమంది కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.

ఆ నోటీసే కొంపముంచిందా..?

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌కు ఇటీవల స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసే సచిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు ఆయన మద్దతు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ లేఖతో సచిన్‌ విషయంలో ముఖ్యమంత్రి తన పరిధి దాటి వ్యవహరించినట్లు వారంతా భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాతావరణంలో తాము గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేసే పరిస్థితులు లేవని వారు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సచిన్‌ మద్దతు వర్గం గురుగ్రామ్‌లోని వివిధ రిసార్టులకు చేరినట్లు సమాచారం.

దీనిపై వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తనకు కూడా ఎస్‌వోజీ నుంచి నోటీసులు అందాయని తెలిపారు. ఈ నోటీసు వల్లే సచిన్‌ అసంతృప్తి గురయ్యారంటూ ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఎస్‌వోజీకి ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు భాజపా నేతల్ని ఎస్‌వోజీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో రాజ్యసభ ఎన్నిల సమయంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వీటి ఆధారంగానే సచిన్‌కు నోటీసులు పంపినట్లు జైపుర్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పైలట్‌ బలమెంత?

యువ నాయకుడు సచిన్‌ పైలట్‌కు 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. మరికొందరు స్వతంత్రులు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు సమాచారం. సచిన్‌ పైలట్‌ తీసుకునే నిర్ణయం ఏదైనా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్‌ పైలట్‌ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్‌ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. వాస్తవంగా సచిన్‌ వెంట ఉన్నది ఎందరు? ప్రభుత్వం నిలుస్తుందా? వంటి ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానం రానుంది.

19:11 July 12

భాజపాపై విమర్శలు...

ప్రభుత్వంలో అనిశ్చితిపై రాష్ట్ర కేబినెట్​ మంత్రి హరీశ్​ చౌదరీ భాజపాపై విమర్శలు చేశారు. రాజస్థాన్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఐదేళ్ల పాలను పూర్తి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

19:09 July 12

శాసనసభ్యులతో భేటీ...

ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సీఎం గహ్లోత్​ సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.

19:03 July 12

మరో మలుపు...

రాజస్థాన్​ రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం గహ్లోత్​పై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ చేతిలో 30 మంది కాంగ్రెస్​ సహా స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. పైలట్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వీరు ఆయన వెంటే ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

18:23 July 12

హస్తినలో మంతనాలు- రసవత్తరంగా రాజస్థాన్​ రాజకీయం

రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు ఉత్కంఠకర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన మరుసటి రోజే ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో దిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తనను త‌ప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ స‌చిన్‌ పైల‌ట్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితిని సోనియా గాంధీతోపాటు రాహుల్‌ను క‌లిసి వివ‌రించ‌నున్నట్లు స‌మాచారం. తమకు దాదాపు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సచిన్‌ వర్గం చెబుతోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ మద్దతుదారులు మాత్రం స‌చిన్ పైల‌ట్ భారతీయ జనతా పార్టీకి స‌న్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజ‌స్థాన్‌లోనూ ఆ పార్టీ పావులు క‌దుపుతోందని విమర్శిస్తున్నారు.

Last Updated : Jul 12, 2020, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.