ETV Bharat / bharat

"ఫేస్​బుక్​పై ఆందోళన" - ఫేస్​బుక్​

పార్లమెంటరీ కమిటీ సభ్యుల ఎదుట ఫేస్​బుక్​ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లో పౌరుల హక్కుల సంరక్షణపై వివరణ తీసుకున్నారు కమిటీ సభ్యులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దుర్వినియోగం అవకుండా తీసుకునే చర్యలపై ఫేస్​బుక్​ ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది.

ఫేస్​బుక్​
author img

By

Published : Mar 6, 2019, 9:30 PM IST

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ సామాజిక మాధ్యమం​ దుర్వినియోగం అవకుండా ఫేస్​బుక్​ నియంత్రిస్తుందా అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది పార్లమెంటరీ కమిటీ.

భాజపా ఎంపీ అనురాగ్​ ఠాకూర్​ నేతృత్వంలో సమాచార, సాంకేతికతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ ఎదుట ఫేస్​బుక్​ ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల్లో ఫేస్​బుక్​ దుర్వినియోగం అవుతుందన్న ఎంపీల వాదనలపై వివరణ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో ప్రకటనలు ఇచ్చే వారి గుర్తింపు, స్థలం తెలుపుతూ ఓ ప్రత్యేక వెబ్​పేజీని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని ఐటీ పార్లమెంటరీ కమిటీకి ఫేస్​బుక్​ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన పొరపాట్లకు ఫేస్​బుక్​ క్షమాపణ చెప్పినట్టు సమాచారం.

భారత్​లో ఫేస్​బుక్​ ప్రకటనలను, అంశాలను, మార్కెటింగ్​ కార్యాకలాపాలను నియంత్రించే వ్యవస్థపై కమిటీ అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు ప్రతినిధులు.

ఉగ్రవాదంపై ముఖ్యంగా ఇటీవలి పుల్వామా ఉగ్రదాడిపై కొందరు ఫేస్​బుక్​ ఉద్యోగులు చేసిన పోస్టులపై, ట్వీట్లపైనా వివరణ కోరారు కమిటీ సభ్యులు. వీటిపై క్షమాపణలు కోరారు ఫేస్​బుక్ పబ్లిక్​ పాలసీ​ ఉపాధ్యక్షుడు జోయోల్​ కప్లన్​. అయినా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో పౌరుల హక్కుల పరిరక్షణపై వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​ ప్రతినిధుల వివరణను త్వరలో విననుంది 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ సామాజిక మాధ్యమం​ దుర్వినియోగం అవకుండా ఫేస్​బుక్​ నియంత్రిస్తుందా అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది పార్లమెంటరీ కమిటీ.

భాజపా ఎంపీ అనురాగ్​ ఠాకూర్​ నేతృత్వంలో సమాచార, సాంకేతికతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ ఎదుట ఫేస్​బుక్​ ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల్లో ఫేస్​బుక్​ దుర్వినియోగం అవుతుందన్న ఎంపీల వాదనలపై వివరణ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో ప్రకటనలు ఇచ్చే వారి గుర్తింపు, స్థలం తెలుపుతూ ఓ ప్రత్యేక వెబ్​పేజీని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని ఐటీ పార్లమెంటరీ కమిటీకి ఫేస్​బుక్​ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన పొరపాట్లకు ఫేస్​బుక్​ క్షమాపణ చెప్పినట్టు సమాచారం.

భారత్​లో ఫేస్​బుక్​ ప్రకటనలను, అంశాలను, మార్కెటింగ్​ కార్యాకలాపాలను నియంత్రించే వ్యవస్థపై కమిటీ అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు ప్రతినిధులు.

ఉగ్రవాదంపై ముఖ్యంగా ఇటీవలి పుల్వామా ఉగ్రదాడిపై కొందరు ఫేస్​బుక్​ ఉద్యోగులు చేసిన పోస్టులపై, ట్వీట్లపైనా వివరణ కోరారు కమిటీ సభ్యులు. వీటిపై క్షమాపణలు కోరారు ఫేస్​బుక్ పబ్లిక్​ పాలసీ​ ఉపాధ్యక్షుడు జోయోల్​ కప్లన్​. అయినా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో పౌరుల హక్కుల పరిరక్షణపై వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​ ప్రతినిధుల వివరణను త్వరలో విననుంది 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ.

Intro:Body:

a


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.