భారత్లో గత నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యింది. అయితే ఈసారి రుతుపవనాల విషయంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ప్రైవేటు సంస్థ స్కైమెట్ వెదర్ పరస్పర విరుద్ధంగా అంచనాలను వెల్లడించాయి.
ఏప్రిల్లో ఐఎండీ... వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) 96 శాతం ఉంటుందని, స్కైమెట్ 93 శాతం ఉంటుందని అంచనా వేశాయి. నిజానికి ఈ రెండు సంస్థలూ ప్లస్ లేదా మైనస్ 5 శాతం మార్జిన్తో తప్పుడు అంచనాలను ఇచ్చాయి.
స్కైమెట్ ఎల్పీఏలో సాధారణం కన్నా తక్కువ లేదా సాధారణ వర్షపాతం కురుస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పుడు వర్షాలు ముగిశాయి. దీని ప్రకారం ఐఎండీ 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని ప్రకటించింది.
వివరణాత్మక విశ్లేషణ
భారత వాతావరణశాఖ వివరణాత్మక విశ్లేషణ చేస్తుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర స్పష్టం చేశారు. ఎల్నినో తటస్థంగా మారడం, హిందూ మహాసముద్రం ద్విధ్రువం(ఐఓడీ) సానుకూలంగా మారడం లాంటి అంశాలను కచ్చితంగా అంచనా వేయగలిగామని ఆయన తెలిపారు. ప్రపంచంలోని మిగతా సంస్థలు తమ అంచనాలను మార్చినా ఐఎండీ మార్చలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుత డేటాను అంచనా వేస్తామని, కాలానుగుణంగా ఇందులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని మోహపాత్ర చెప్పారు.
అంచనాలు తప్పాయ్..!
వర్షపాతం సాధారణం కంటే అధికంగా కురవడంపై స్కైమెట్ వెదర్ ఉపాధ్యక్షుడు మహేష్ పలావత్ వివరణ ఇచ్చారు. ఎల్నినో సాధారణంగా ఐఓడీని ముంచెత్తుంది. అయితే ఈసారి వేరే మార్గం పట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా సంస్థలు కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనా వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు