ETV Bharat / bharat

దేశ ప్రగతివైపు.. రాజ్యాంగ నిర్దేశపు అడుగులు

author img

By

Published : Nov 26, 2019, 2:38 AM IST

రాజ్యాంగ రచనలో ఎందరో కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగ నిర్మాణం సాగిన రీతి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహామహుల కృషికి చిహ్నం భారత రాజ్యాంగం.

దేశ ప్రగతివైపు.. రాజ్యాంగ నిర్దేశపు అడుగులు

ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేళ్లపాటు సాగిన రాజ్యాంగ రచనలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? మహామహుల కృషి ఏ రీతిన సాగింది? అనేవి కీలకాంశాలు.

రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం..

భారత్​లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్​ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబర్​ 19న ఆకాశవాణి (ఆల్​ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్​ జనరల్​ లార్డ్​ వేవెల్​ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్​ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1946 డిసెంబర్​ 6న రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్​లాల్​ నెహ్రూ(భారత జాతీయ కాంగ్రెస్​), బాబూ జగ్జీవన్​రామ్​(కార్మిక వర్గం), మహమ్మద్​ అలీ జిన్నా(ముస్లింలీగ్​), డాక్టర్​ బి.ఆర్​.అంబేడ్కర్​ (షెడ్యూల్డ్​ కులాలు), శ్యామా ప్రసాద్​ ముఖర్జీ, ఎం.ఆర్​.జయకర్​ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్​, సరోజినీనాయుడు తదితరులున్నారు. తెలుగు నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్​ దేశ్​ముఖ్​, కళావెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్​.జి. రంగా, బొబ్బిలి రామకృష్ణరంగారావు ఎన్నికయ్యారు.

రాజేంద్రప్రసాద్​ నేతృత్వం...

రాజ్యాంగ పరిషత్​ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​, ఉపాధ్యక్షులుగా హెచ్​సీ ముఖర్జీ, కృష్ణమాచారి, న్యాయ సలహాదారుగా బి.ఎన్​.రావు ఎన్నికయ్యారు.

అంబేడ్కర్​ సారథ్యం...

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది.
రాజ్యాంగం రూపకల్పన ఇలా...

1946 డిసెంబర్​ 9..

జేబీ కృపలానీ ఆధ్వర్యంలో పార్లమెంటులోని రాజ్యాంగ(సెంట్రల్​) హాల్​లో రాజ్యాంగ పరిషత్​ తొలి సమావేశం జరిగింది. పరిషత్​ తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్​ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్​ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

1947 జనవరి 22..

రాజ్యాంగ మౌలిక నియమాలను విశదీకరిస్తూ రూపొందించిన 'లక్ష్యాలు-ఆశయాలు' తీర్మానాన్ని జవహర్​లాల్​ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22న ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.

1948 ఫిబ్రవరి 21...

ముసాయిదా రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 8 అనుబంధాలతో ప్రచురించి రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలు పంపేందుకు 8 నెలల సమయం కేటాయించారు. 1948 నవంబర్​ 4న పరిషత్తు సమావేశమై చర్చను ప్రారంభించింది.

1949 నవంబర్​ 26..

2వేల సవరణల అనంతరం ప్రజాభిప్రాయాలకు పట్టంకడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.

1950 జనవరి 24...

రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకరు, ఉప స్పీకరు పదవులు, ప్రొవిజినల్​ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.

1950 జనవరి 26...

భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం.

ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేళ్లపాటు సాగిన రాజ్యాంగ రచనలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? మహామహుల కృషి ఏ రీతిన సాగింది? అనేవి కీలకాంశాలు.

రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం..

భారత్​లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్​ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబర్​ 19న ఆకాశవాణి (ఆల్​ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్​ జనరల్​ లార్డ్​ వేవెల్​ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్​ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1946 డిసెంబర్​ 6న రాజ్యాంగ పరిషత్​ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్​లాల్​ నెహ్రూ(భారత జాతీయ కాంగ్రెస్​), బాబూ జగ్జీవన్​రామ్​(కార్మిక వర్గం), మహమ్మద్​ అలీ జిన్నా(ముస్లింలీగ్​), డాక్టర్​ బి.ఆర్​.అంబేడ్కర్​ (షెడ్యూల్డ్​ కులాలు), శ్యామా ప్రసాద్​ ముఖర్జీ, ఎం.ఆర్​.జయకర్​ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్​, సరోజినీనాయుడు తదితరులున్నారు. తెలుగు నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్​ దేశ్​ముఖ్​, కళావెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్​.జి. రంగా, బొబ్బిలి రామకృష్ణరంగారావు ఎన్నికయ్యారు.

రాజేంద్రప్రసాద్​ నేతృత్వం...

రాజ్యాంగ పరిషత్​ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​, ఉపాధ్యక్షులుగా హెచ్​సీ ముఖర్జీ, కృష్ణమాచారి, న్యాయ సలహాదారుగా బి.ఎన్​.రావు ఎన్నికయ్యారు.

అంబేడ్కర్​ సారథ్యం...

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది.
రాజ్యాంగం రూపకల్పన ఇలా...

1946 డిసెంబర్​ 9..

జేబీ కృపలానీ ఆధ్వర్యంలో పార్లమెంటులోని రాజ్యాంగ(సెంట్రల్​) హాల్​లో రాజ్యాంగ పరిషత్​ తొలి సమావేశం జరిగింది. పరిషత్​ తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్​ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్​ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

1947 జనవరి 22..

రాజ్యాంగ మౌలిక నియమాలను విశదీకరిస్తూ రూపొందించిన 'లక్ష్యాలు-ఆశయాలు' తీర్మానాన్ని జవహర్​లాల్​ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22న ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.

1948 ఫిబ్రవరి 21...

ముసాయిదా రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 8 అనుబంధాలతో ప్రచురించి రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలు పంపేందుకు 8 నెలల సమయం కేటాయించారు. 1948 నవంబర్​ 4న పరిషత్తు సమావేశమై చర్చను ప్రారంభించింది.

1949 నవంబర్​ 26..

2వేల సవరణల అనంతరం ప్రజాభిప్రాయాలకు పట్టంకడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.

1950 జనవరి 24...

రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకరు, ఉప స్పీకరు పదవులు, ప్రొవిజినల్​ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.

1950 జనవరి 26...

భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం.

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 25 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1055: Hong Kong University AP Clients Only 4241642
Pro-democracy politicians arrive, protesters on site
AP-APTN-1047: ARCHIVE UK Uber AP Clients Only 4241640
Uber loses license to operate in London over safety
AP-APTN-1034: Kenya Floods AP Clients Only 4241639
Death toll from Kenya floods rises to 65
AP-APTN-1025: Japan Pope Dome AP Clients Only 4241638
Tens of thousands welcome Pope at Dome for Mass
AP-APTN-1018: China MOFA Briefing AP Clients Only 4241635
DAILY MOFA BRIEFING
AP-APTN-1006: Hong Kong UK Alton AP Clients Only 4241637
UK politician David Alton comments on HKong elex
AP-APTN-1002: US NY Schumer Navy Secretary Must credit WABC-TV; No access New York; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4241636
Schumer: ousted Navy chief 'did the right thing'
AP-APTN-0934: US AL Sheriff Killed Must credit Alabama News Network; No access Montgomery/Selma; No use US broadcast networks; No re-sale, re-use or archive 4241634
Alabama county sheriff killed, suspect in custody
AP-APTN-0922: Hong Kong Election Reax 2 AP Clients Only 4241632
DAB chair concedes defeat in district council elex
AP-APTN-0913: Iran ICT Minister Apology No access Iran / No Access BBC Persian / No Access VOA Persian / No Access Manoto TV / No Access Iran International 4241628
ICT minister apologizes for cutting off internet
AP-APTN-0903: Japan Pope Reax AP Clients Only 4241615
Faithful await Mass with Pope Francis
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.