ETV Bharat / bharat

రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు - నల్లధనం గుట్టురట్టు చేసిన సీబీఐ

హాంకాంగ్​కు నల్లధనం బదిలీ చేశారనే ఆరోపణలతో 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బ్యాంకుల ద్వారా బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు.

cbi-books-51-entities
రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు
author img

By

Published : Jan 6, 2020, 8:04 PM IST

హాంకాంగ్​కు నల్లధనం ట్రాన్స్​ఫర్​ ఆరోపణలపై చెన్నై వ్యక్తులకు చెందిన 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బదిలీ చేశారని పేర్కొంది. తమిళనాడులోని బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఎస్​బీఐ, పంజాబ్​ నేషనల్​ బ్యాంకు శాఖలకు చెందిన గుర్తుతెలియని అధికారుల సాయంతో రహస్యంగా ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు.

అక్రమాలకు పాల్పడ్డ 48 సంస్థలకు చెందిన 51 సంస్థల ప్రస్తుత బ్యాంకు ఖాతాల వివరాలు సంపాదించినట్లు పేర్కొన్నారు సీబీఐ అధికారులు. బీఓఐ, ఎస్​బీఐ, పీఎన్​బీకి చెందిన శాఖలలోనే సదరు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.

48 సంస్థలతో పాటు మహ్మద్​ ఇబ్రామ్సా జానీ, జింతా మిదర్​, నిజాముద్దీన్​ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లను ఎఫ్​ఐర్​లో చేర్చారు. ఇందులో 24 కంపెనీలు దిగుమతులు చేసుకున్న వస్తువుల విలువ.. బ్యాంకులకు సమర్పించిన డేటాతో సరిపోలడం లేదన్నారు అధికారులు.

ఈ అక్రమానికి పాల్పడిన నిందితులతో పాటు సహాయపడిన వారికి.. బదిలీ చేసిన మొత్తం ఆధారంగా కమీషన్​ అందినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులకూ లంచం ఇచ్చినట్లు ఎఫ్​ఐర్​లో పేర్కొన్నారు.

ఇందులో ఎక్కువ మొత్తం బదిలీ 2015 రెండో అర్ధ భాగంలో జరిగినట్లు.. కోట్ల రూపాయల మేర బదిలీ జరిగితే... లక్షల్లో లెక్క చూపినట్లు అధికారులు వెల్లడించారు.

హాంకాంగ్​కు నల్లధనం ట్రాన్స్​ఫర్​ ఆరోపణలపై చెన్నై వ్యక్తులకు చెందిన 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బదిలీ చేశారని పేర్కొంది. తమిళనాడులోని బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఎస్​బీఐ, పంజాబ్​ నేషనల్​ బ్యాంకు శాఖలకు చెందిన గుర్తుతెలియని అధికారుల సాయంతో రహస్యంగా ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు.

అక్రమాలకు పాల్పడ్డ 48 సంస్థలకు చెందిన 51 సంస్థల ప్రస్తుత బ్యాంకు ఖాతాల వివరాలు సంపాదించినట్లు పేర్కొన్నారు సీబీఐ అధికారులు. బీఓఐ, ఎస్​బీఐ, పీఎన్​బీకి చెందిన శాఖలలోనే సదరు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.

48 సంస్థలతో పాటు మహ్మద్​ ఇబ్రామ్సా జానీ, జింతా మిదర్​, నిజాముద్దీన్​ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లను ఎఫ్​ఐర్​లో చేర్చారు. ఇందులో 24 కంపెనీలు దిగుమతులు చేసుకున్న వస్తువుల విలువ.. బ్యాంకులకు సమర్పించిన డేటాతో సరిపోలడం లేదన్నారు అధికారులు.

ఈ అక్రమానికి పాల్పడిన నిందితులతో పాటు సహాయపడిన వారికి.. బదిలీ చేసిన మొత్తం ఆధారంగా కమీషన్​ అందినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులకూ లంచం ఇచ్చినట్లు ఎఫ్​ఐర్​లో పేర్కొన్నారు.

ఇందులో ఎక్కువ మొత్తం బదిలీ 2015 రెండో అర్ధ భాగంలో జరిగినట్లు.. కోట్ల రూపాయల మేర బదిలీ జరిగితే... లక్షల్లో లెక్క చూపినట్లు అధికారులు వెల్లడించారు.

Mumbai, Jan 06 (ANI): Maharashtra Chief Minister Uddhav Thackeray condemned the attack in the campus of Jawaharlal Nehru University and said that it reminded him of terror attack of 26/11. He said, "I was reminded of the 26/11 Mumbai terror attack. Investigation is needed to find out who were these masked attackers." Masked goons vandalized the campus of JNU and attacked people in the evening of January 05, where more than 30 students and professors have sustained injuries.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.