మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. గుజరాత్లో కొవిడ్ బాధితులు పెరుగుతున్నారు. మహారాష్ట్రలో తాజాగా12,248 కేసులు నమోదయ్యాయి. మరో 390 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5,15,332 దాటింది. మరణాల సంఖ్య 17,757కి ఎగబాకింది.
కర్ణాటకలో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. తాజాగా 5,985 మంది వైరస్ బారినపడ్డారు. మరో 107మంది మహమ్మారికి బలయ్యారు. దాదాపు 94 వేలమంది డిశ్చార్జి అయ్యారు.
బంగాల్లో కొత్తగా 2,059 మందికి కరోనా సోకింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2,059కు చేరింది.
గుజరాత్లో తాజాగా 1078 కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 71 వేలు దాటింది. ఇప్పటివరకు 2,654 మంది మరణించారు.
ఇదీచూడండి: లైవ్ వీడియో: యువతిని ఈడ్చుకెళ్లిన కారు