ETV Bharat / cinema

రామకృష్ణ గ్రాఫికల్ వండర్స్

కోడి రామకృష్ణ చిత్రాలలో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవేంటో చూద్దాం.

author img

By

Published : Feb 22, 2019, 6:33 PM IST

Updated : Feb 22, 2019, 7:48 PM IST

కోడి రామకృష్ణ

150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కోడి రామకృష్ణ అందరు హీరోలతో అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. భక్తి, హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలతో అలరించారు. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్​కు పెద్దపీట వేశారు.

తెలుగులో గ్రాఫిక్స్​కు కోడి రామకృష్ణ ఆద్యుడిగా చెప్పొచ్చు. అమ్మోరు సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. గ్రాఫిక్స్​తో విజువల్ వండర్ సృష్టించారు. ఆ తర్వాత 'దేవి' 'దేవీ పుత్రుడు', 'అంజి', 'అరుంధతి', 'నాగభరణం' చిత్రాలతో అలరించారు.

బొమ్మాలి నిన్నొదల అంటూ తెరకెక్కించిన అరుంధతి సినిమా ఘనవిజయం సాధించింది. అందుకు ప్రధాన కారణం సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం. అంజి, దేవీపుత్రుడు చిత్రాల్లోనూ అబ్బురపరిచే గ్రాఫిక్స్​తో ఆకట్టుకున్నారు.

చివరగా ఆయన తెరకెక్కించిన చిత్రం నాగభరణం. కన్నడ నటుడు విష్ణువర్ధన్ 1972లో తీసిన నాగరాహువు సినిమా రీమేక్ చేశారు. చనిపోయిన విష్ణువర్ధన్​ను గ్రాఫిక్స్​తో మళ్లీ తెరపై చూపించడం ఆయనకే చెల్లింది. ఇదే చిత్రంలో 120 అడుగుల పామును సృష్టించి ఔరా అనిపించారు కోడి.

ఇవీ చూడండి..కోడి హెడ్​బ్యాండ్ కథేంటి.!

150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కోడి రామకృష్ణ అందరు హీరోలతో అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. భక్తి, హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలతో అలరించారు. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్​కు పెద్దపీట వేశారు.

తెలుగులో గ్రాఫిక్స్​కు కోడి రామకృష్ణ ఆద్యుడిగా చెప్పొచ్చు. అమ్మోరు సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. గ్రాఫిక్స్​తో విజువల్ వండర్ సృష్టించారు. ఆ తర్వాత 'దేవి' 'దేవీ పుత్రుడు', 'అంజి', 'అరుంధతి', 'నాగభరణం' చిత్రాలతో అలరించారు.

బొమ్మాలి నిన్నొదల అంటూ తెరకెక్కించిన అరుంధతి సినిమా ఘనవిజయం సాధించింది. అందుకు ప్రధాన కారణం సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం. అంజి, దేవీపుత్రుడు చిత్రాల్లోనూ అబ్బురపరిచే గ్రాఫిక్స్​తో ఆకట్టుకున్నారు.

చివరగా ఆయన తెరకెక్కించిన చిత్రం నాగభరణం. కన్నడ నటుడు విష్ణువర్ధన్ 1972లో తీసిన నాగరాహువు సినిమా రీమేక్ చేశారు. చనిపోయిన విష్ణువర్ధన్​ను గ్రాఫిక్స్​తో మళ్లీ తెరపై చూపించడం ఆయనకే చెల్లింది. ఇదే చిత్రంలో 120 అడుగుల పామును సృష్టించి ఔరా అనిపించారు కోడి.

ఇవీ చూడండి..కోడి హెడ్​బ్యాండ్ కథేంటి.!


Ajmer (Rajasthan), Feb 22 (ANI): A lady beggar in Rajasthan's Ajmer, passed away last year, had Rs 6.6 lakh as her life savings which she donated to a temple committee. The money has now been donated to the families of CRPF personnel who lost their lives in the Pulwama terror attack. The late old lady, Devaki Sharama, had urged the temple committee to use the money for a noble cause, and her custodian on Thursday submitted a demand draft in the name of Chief Minister Relief Fund in Ajmer.
Last Updated : Feb 22, 2019, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.