ETV Bharat / east-godavari

శిథిలావస్థ భవనాల్లో ఎన్నాళ్లీ చదువులు..!

author img

By

Published : Nov 26, 2019, 2:22 AM IST

పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకుంటుంటే ఏ తల్లిదండ్రులకైన ఎనలేని సంతోషం ఉంటుంది... కానీ ఓ గ్రామంలో మాత్రం పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తారో... లేదో అని భయందోళనలో తల్లిదండ్రులు ఉంటారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల తరగతి గదులు ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

school-damaged-in-east-godavari-district
శిథిలావస్థ భవనాల్లో ఇంకా ఎన్నాళ్లు.... ఈ చదువులు..!
శిథిలావస్థ భవనాల్లో ఇంకా ఎన్నాళ్లు.... ఈ చదువులు

తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి జడ్పీ పాఠశాలలో సూమారుగా 250 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ చదువుకోవటానికి మాత్రం ఆ పాఠశాలలో సరైన వసతులు లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ప్రాణాభయంతో చదువును నెట్టుకువస్తున్నారు. ఒకే భవనంలో అన్ని తరగతులు నిర్వహించటంతో వారిలో మరింత ఆందోళన మెుదలైంది. భవనం పైభాగం పెచ్చులుడి మీదపడుతున్నాయని భయపడుతున్నారు విద్యార్థులు. వర్షాకాలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చోటానికి చోటులేక... పుస్తకాలన్ని తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక గోడలకు విద్యుత్ షాక్ వస్తుందంటున్నారు.నూతన భవనం నిర్మించేందుకు ఉపాధ్యాయులు ప్రతిపాదనలు పంపిచారు. కానీ నిధులు మాత్రం రాకపోవటం వలన శిథిలమైన భవనంలోనే చదువులు చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

శిథిలావస్థ భవనాల్లో ఇంకా ఎన్నాళ్లు.... ఈ చదువులు

తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి జడ్పీ పాఠశాలలో సూమారుగా 250 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ చదువుకోవటానికి మాత్రం ఆ పాఠశాలలో సరైన వసతులు లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ప్రాణాభయంతో చదువును నెట్టుకువస్తున్నారు. ఒకే భవనంలో అన్ని తరగతులు నిర్వహించటంతో వారిలో మరింత ఆందోళన మెుదలైంది. భవనం పైభాగం పెచ్చులుడి మీదపడుతున్నాయని భయపడుతున్నారు విద్యార్థులు. వర్షాకాలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చోటానికి చోటులేక... పుస్తకాలన్ని తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక గోడలకు విద్యుత్ షాక్ వస్తుందంటున్నారు.నూతన భవనం నిర్మించేందుకు ఉపాధ్యాయులు ప్రతిపాదనలు పంపిచారు. కానీ నిధులు మాత్రం రాకపోవటం వలన శిథిలమైన భవనంలోనే చదువులు చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

పిల్లలే తల్లిదండ్రులైన వేళ...

Intro:శిథిల నీడలో చదువులు

ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే భయాందోళన. శిథిల స్థితిలో ఉన్న భవనంలో విద్యనభ్యసిస్తున్న తమ పిల్లలకు ఏ ప్రమాదం జరుగుతుందోనని. తూర్పు గోదావరి జిల్లా నాగులాపల్లి జడ్పీ ఆంగ్ల మాధ్యమం పాఠశాల భవనం పరిస్థితి ఇ అత్యంత దయనీయంగా మారింది. పాఠశాల భవనం పూర్తిగా శిథిలానికి చేరుకోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటూ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తరగతి గదుల్లో ఉండగానే భవనం స్లాబ్ అడుగుభాగం పెచ్చులూడి పడిపోవడంతో భయాందోళనలన చెందుతున్నారు. పాఠశాల మొత్తం భవనంలో నిర్వహించడంతో ఇప్పుడు ఆ భవనం మొత్తం శిథిలానికి చేరుకుంది. దీంతో 250 మంది విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది. భవనం అడుగుభాగం కిటికీలు పూర్తిగా ధ్వంసం అవడంతో వర్షాలు కురిసిన సమయంలో నీరు నేరుగా తరగతి గదిలోకి వచ్చేసి పుస్తకాలు తడిసిపోతున్నాయి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గోడలకు విద్యుత్ సరఫరా జరిగి విద్యుత్ షాక్ తగులుతుందని వాపోతున్నారు. నూతనంగా పాఠశాల భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించిన నిధులు మంజూరు కాకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రమాదకర భవనంలోనే పాఠశాల నిర్వహణ జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి వచ్చే విద్యా సంవత్సరానికి అయినా నా పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు కోరుతున్నారు.


Body:గంప రాజు. పిఠాపురం


Conclusion:799607047

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.