ETV Bharat / cricket

బీసీసీఐకి సుప్రీం చురకలు

author img

By

Published : Feb 21, 2019, 6:39 PM IST

భారత క్రికెట్​ బోర్డు బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైనది, పేరు కలిగినది. అలాంటి సంస్థకు అధిపతులంటే ఎంత సఖ్యతతో వ్యవహరించాలి. దేశం మొత్తం గమనిస్తుంటుంది. ఆ సంఘంలోని సభ్యులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సుప్రీం చురకలంటించింది.

బీసీసీఐకి సుప్రీం చురకలు

బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు వినోద్​ రాయ్​, సభ్యురాలు డయానా ఎడుల్జీ తీరుపై భారత అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. విబేధాలపై ప్రజలు చర్చించుకునేలా వ్యవహరించొద్దని ఆదేశించింది.

  • జస్టిస్​ ఏస్​ఏ బాబ్డే, జస్టిస్ ఏఎమ్​ సప్రేలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ విషయంపై చర్చించారు. సీఓఏలో మరో ముగ్గురు సభ్యులను చేర్చనున్నట్లూ వెల్లడించారు.
    supreme to bcci
    బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ, అధ్యక్షుడు వినోద్​ రాయ్​

'సీఓఏ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందని చాలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంతర్గత విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు. అది ఎంత మాత్రం బీసీసీఐ పరువు,ప్రతిష్ఠకు మంచిది కాదు' అంటూ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

గతంలో చిన్న కారణాలతో చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఆర్థికవేత్త విక్రమ్​ లిమయే రాజీనామాలతో సీఓఏలో వీరిద్దరే మిగిలారు.

బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు వినోద్​ రాయ్​, సభ్యురాలు డయానా ఎడుల్జీ తీరుపై భారత అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. విబేధాలపై ప్రజలు చర్చించుకునేలా వ్యవహరించొద్దని ఆదేశించింది.

  • జస్టిస్​ ఏస్​ఏ బాబ్డే, జస్టిస్ ఏఎమ్​ సప్రేలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ విషయంపై చర్చించారు. సీఓఏలో మరో ముగ్గురు సభ్యులను చేర్చనున్నట్లూ వెల్లడించారు.
    supreme to bcci
    బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ, అధ్యక్షుడు వినోద్​ రాయ్​

'సీఓఏ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందని చాలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంతర్గత విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు. అది ఎంత మాత్రం బీసీసీఐ పరువు,ప్రతిష్ఠకు మంచిది కాదు' అంటూ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

గతంలో చిన్న కారణాలతో చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఆర్థికవేత్త విక్రమ్​ లిమయే రాజీనామాలతో సీఓఏలో వీరిద్దరే మిగిలారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.