పాకిస్థాన్తో మ్యాచ్ గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేయటాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పుబట్టారు. సచిన్ కెరీర్ మొదలు పెట్టిందే పాకిస్థాన్ను ఓడించి అని గుర్తుచేశారాయన.
మాట్లాడిన వారి అర్హత ఏంటో గుర్తించి విమర్శలు చేయాలని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు తెలిపారు. సచిన్ ఓ భారతరత్న అని, సునీల్ గవాస్కర్ క్రికెట్ లెజెండ్ అని గుర్తు చేశారు.
పుల్వామా దాడి తర్వాత పలువురు ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరించాలని కోరారు. ఈ విషయమై సచిన్ మ్యాచ్ రద్దైతే భారత్కే నష్టమని రెండు పాయింట్లు కోల్పోవడం మంచిది కాదని సలహా ఇచ్చాడు. పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు.
మ్యాచ్పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోగా ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని భారత జట్టు అంటోంది.
ఇవీ చదవండి..గెలుపే ముఖ్యం..