కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చే చర్యలు చేపట్టింది. స్టార్టప్ అర్థాన్ని సడలించి మొత్తం పెట్టుబడి 25 కోట్ల వరకు ఉన్నట్లయితే ఏంజెల్ పన్నులో పూర్తి రాయితీ కల్పించింది. ఈ పరిమితి ఇప్పటివరకు రూ. 10 కోట్ల వరకు మాత్రమే ఉండేది.
స్టార్టప్లు తీసుకునే ప్రైవేటు పెట్టుబడులే ఏంజెల్ నిధులు. వీటికి తగ్గ ఈక్విటీ షేర్లను స్టారప్లు పెట్టుబడిదారులకు అందిస్తాయి. ఏంజెల్ నిధులపై ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(viib) ప్రకారం ఏంజెల్ పన్ను విధిస్తోంది. దీన్ని తాజాగా సవరించారు.
ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల వరకు ఆదాయం సంపాదించిన వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. దీన్ని 100 కోట్లకు మార్చారు.
అర్హత ఉన్న స్టార్టప్లలో ప్రవాసులు, క్యాటగిరి-1లోని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకూ 25 కోట్ల వరకు రాయితీ కల్పించారు.
100 కోట్ల నికర విలువ, 250 కోట్ల ఆదాయం ఉన్న ఏదైనా లిస్టెడ్ కంపెనీ... అర్హత ఉన్న స్టార్టప్లో పెట్టుబడులు పెట్టినట్లయితే 25 కోట్ల కంటే ఎక్కువగా పన్ను రాయితీ పొందటానికి వీలుంటుంది. అంతే కాకుండా భారత పారిశ్రామిక విభాగం గుర్తించిన కంపెనీకి చెందిన వ్యాపార వేత్త స్పెసిఫైడ్ అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టనట్లయితే రాయితీ పొందవచ్చు.
స్థిరాస్తి, ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా..... ఇతరులకు రుణాలివ్వటం, వేరే సంస్థలకు మూలధనం అందించటం, సాధారణ వ్యాపారానికి సంబంధించినవి కాకుండా ఇతర ఆస్తులలో పెట్టుబడులు పెట్టినట్లయితే... సెక్షన్ 56(2)(viib) కింద మినహాయింపు పొందటానికి అనర్హులవుతారు.
ఈ రాయితీలు, మినహాయింపులు పొందటానికి స్టార్టప్లు... సంతకం చేసిన డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మినహాయింపు, రాయితీ ఉత్తర్వులను ప్రత్యక్ష పన్నుల బోర్డుకు పంపించనుంది.