ETV Bharat / economy

కార్మిక పింఛనుకు దరఖాస్తులు

author img

By

Published : Feb 17, 2019, 5:19 PM IST

శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకానికి అర్హులైన అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న 3లక్షల13వేల సాధారణ సేవా కేంద్రాల్లో (సీఎస్​సీ)  పేర్లను నమోదు చేసుకోవచ్చు.

కార్మిక పింఛనుకు దరఖాస్తులు

2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్​లో ప్రకటించిన ప్రధాన్​ మంత్రి శ్రమ్ యోగి మాన్​ధన్​ (పీఎంఎస్​వైఎమ్​) పథకానికి కార్మిక మంత్రిత్వ శాఖ దరఖాస్తుల స్వీరణను ప్రారంభించింది.

అర్హులెవరు..

నెలకు రూ.15,000లకు మించని ఆదాయం ఉన్న18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులు.

దరఖాస్తు ఎక్కడ? ఎలా?

పథకానికి అర్హులైన అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న 3.13 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో (సీఎస్​సీ) పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసెస్​ ఇండియా లిమిటెడ్​, ఎలక్ట్రానిక్​, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక వాహనాలు దేశ వ్యాప్తంగా ఈ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

అర్హులు... ఆధార్​ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం లేదా జన్​ ధన్​ ఖాతా పుస్తకంతో సమీప సీఎస్​సీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

త్వరలోనే మొబైల్​ యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్టు కార్మిక శాఖ పేర్కొంది. దరఖాస్తు పూర్తయిన వారికి ప్రత్యక గుర్తింపుతో కూడిన రశీదును ఇస్తారు.

దరఖాస్తుదారు జాతీయ పింఛన్​​ పథకం, రాష్ట్ర బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలో ఉంటే ఈ పథకానికి అర్హులు కారు.

పథకం అమలు ఎలా..

పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వయస్సు ప్రకారం నెలసరి చందాలు చెల్లించాల్సి ఉంటుంది.

వయస్సు నెలసరి చందా వయస్సు నెలసరి చందా
18 రూ.55 30 రూ.105
19 రూ.58 30 రూ.110
20 రూ.61 32 రూ.120
21 రూ.64 33 రూ.130
22 రూ.68 34 రూ.140
23 రూ.72 35 రూ.150
24 రూ.76 36 రూ.160
25 రూ.80 37 రూ.170
26 రూ.85 38 రూ.180
27 రూ.90 39 రూ.190
28 రూ.95 40 రూ.200
29 రూ.100
undefined

దరఖాస్తు దారు చెల్లించిన అంతే మొత్తంలో ప్రభుత్వం నెలసరి ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇలా జమ చేసిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పింఛను పొందుతారు. దరఖాస్తు సమయంలో మొదటి నెల చందాను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

పథకం లక్ష్యాలు

ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది శ్రామికులకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్​లో ప్రకటించిన ప్రధాన్​ మంత్రి శ్రమ్ యోగి మాన్​ధన్​ (పీఎంఎస్​వైఎమ్​) పథకానికి కార్మిక మంత్రిత్వ శాఖ దరఖాస్తుల స్వీరణను ప్రారంభించింది.

అర్హులెవరు..

నెలకు రూ.15,000లకు మించని ఆదాయం ఉన్న18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులు.

దరఖాస్తు ఎక్కడ? ఎలా?

పథకానికి అర్హులైన అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న 3.13 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో (సీఎస్​సీ) పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసెస్​ ఇండియా లిమిటెడ్​, ఎలక్ట్రానిక్​, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక వాహనాలు దేశ వ్యాప్తంగా ఈ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

అర్హులు... ఆధార్​ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం లేదా జన్​ ధన్​ ఖాతా పుస్తకంతో సమీప సీఎస్​సీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

త్వరలోనే మొబైల్​ యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్టు కార్మిక శాఖ పేర్కొంది. దరఖాస్తు పూర్తయిన వారికి ప్రత్యక గుర్తింపుతో కూడిన రశీదును ఇస్తారు.

దరఖాస్తుదారు జాతీయ పింఛన్​​ పథకం, రాష్ట్ర బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలో ఉంటే ఈ పథకానికి అర్హులు కారు.

పథకం అమలు ఎలా..

పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వయస్సు ప్రకారం నెలసరి చందాలు చెల్లించాల్సి ఉంటుంది.

వయస్సు నెలసరి చందా వయస్సు నెలసరి చందా
18 రూ.55 30 రూ.105
19 రూ.58 30 రూ.110
20 రూ.61 32 రూ.120
21 రూ.64 33 రూ.130
22 రూ.68 34 రూ.140
23 రూ.72 35 రూ.150
24 రూ.76 36 రూ.160
25 రూ.80 37 రూ.170
26 రూ.85 38 రూ.180
27 రూ.90 39 రూ.190
28 రూ.95 40 రూ.200
29 రూ.100
undefined

దరఖాస్తు దారు చెల్లించిన అంతే మొత్తంలో ప్రభుత్వం నెలసరి ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇలా జమ చేసిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పింఛను పొందుతారు. దరఖాస్తు సమయంలో మొదటి నెల చందాను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

పథకం లక్ష్యాలు

ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది శ్రామికులకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Progreso, Santa Fe, Argentina. 16th February 2019.
++CLIENTS NOTE: PLEASE IGNORE EDIT SENT EARLIER AND REPLACE WITH THIS ONE++
++SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 03:40
STORYLINE:
Cardiff City manager Neil Warnock and the club's CEO Ken Choo paid their respects at the funeral of Emiliano Sala in the town of Progreso in the Argentinian province of Santa Fe on Saturday.
Sala tragically died when the plane chartered by pilot David Ibbotson crashed in the English Channel, as the 28-year-old travelled from Nantes to Cardiff on 21st January having completed his move to the Premier League side.
Sala's body, which was recovered form the wreckage following a privately-funded search, was repatriated in Argentina on Friday.
It was then driven from Buenos Aires to the Santa Fe province where Sala grew up.
Warnock refused to answer questions on the legal aspect of Sala's contract, and both he and Choo underlined the importance of their attendance at the funeral in representation of the Welsh club.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.